జర్నలిస్టుల సంక్షేమం కోసం టియుడబ్ల్యూజే నిరంతర కృషి.
సభ్యత్వ నమోదు కార్యక్రమం
శాయంపేట నేటిధాత్రి:
జాతీయస్థాయిలో జర్నలిస్టుల సంక్షేమ ధ్యేయంగా టియు డబ్ల్యూజే (ఐజేయు) పనిచే స్తుందని ఆ సంఘ జిల్లా నాయకుడు రాజిరెడ్డి, రాష్ట్ర నాయకుడు మధు, సుధాకర్ అన్నారు. పరకాల కేంద్రంలో నిర్వహించిన సభ్యత కార్యక్ర మంలో పలు మండ లాల్లో ఉన్న జర్నలిస్టులు హాజర య్యారు. ఈ సందర్భంగా నాయకుల ఆధ్వర్యంలో సభ్యత నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు.

మాట్లాడుతూ జిల్లా,మండలంలోగాని జర్నలిస్టుల సమస్యల కోసం వారి హక్కుల కోసం నిరంతర పోరాటాలను నిర్వహిస్తూ విధానాలు సాధిస్తున్న సంఘం టీయూడబ్ల్యూజే సంఘం మాత్రమే అన్నారు ఆ సంఘం ద్వారా అనేక విజయాలు సాధించామని గుర్తు చేశారు ముఖ్యంగా జర్నలిస్టు ఇండ్లు ఇళ్ల స్థలాల కోసం అనేక పోరాటాలను నిర్వహించి అందులో విజయం సాధించామని తెలియజేశారు ఆర్టీసీ బస్సులో జర్నలిస్టులకు సౌకర్యం కల్పించి ఘనత, జర్నలిస్ట్ హెల్త్ విషయంలో కార్పొరేట్ వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించడం కోసం కృషి చేస్తున్న సంఘం టి యు డబ్ల్యూ జే (ఐజేయు) అన్నారు. మండలంలో ఉన్న జర్నలిస్టుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు
ఉత్సాహంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం
ఉత్సాహంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. శాయంపేట, దామెర, నడి కూడ,పరకాల మండలాల్లో వివిధ పత్రికల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు టియుడబ్ల్యూ జే (ఐజేయు) నూతన సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడం జరిగింది.