లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో తులసి అర్చన
నర్సంపేట/గీసుకొండ,నేటిధాత్రి:
శ్రావణమాసం మొదటి శనివారం సందర్భంగా వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వామివారికి ఆలయ ప్రధాన అర్చకుడు తాండూరి రామాచార్యులు, ఫణిందర్ విష్ణులు బ్రహ్మాండ వేద మంత్రోచ్ఛారణతో ప్రత్యేక తులసి అర్చన నిర్వహించారు.
ఈ తులసి అర్చన కార్యక్రమంలో స్థానికులు జిల్లా కాంగ్రెస్ నాయకుడు, కొమ్మాల మాజీ ఉపసర్పంచ్ సాయిలి ప్రభాకర్,లక్ష్మీ నరసింహ స్వామి భక్తుడు అమర్ సింగ్ నాయక్,దశ్రుతండా మాజీ సర్పంచ్ కేలత్ స్వామి,భక్తులు మాడిశెట్టి శ్రీనివాస్,గాదం మల్లయ్య భక్తులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.