*గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :*
ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా టీయూసీఐ గుండాల ఏరియా కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 16న కొత్తగూడెం లో జరుగు టీయూ సీఐ జిల్లా మహాసభను జయప్రదం చేయాలని కోరుతూ శుక్రవారం పెట్రోల్ బంక్ ఆటో అడ్డల మీద ప్రచారం నిర్వహించారు. అనంతరం గుండాల ఏరియా అధ్యక్షలు గడ్డం, రమేష్, కార్యదర్శులు, కొమరం, శాంతయ్య,పాల్గొని మాట్లాడుతూ మహాసభను జయప్రదం చేయాలని గుండాల ఏరియా పరిధిలో చేస్తున్న అసంఘటితంగా కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బొంబాయి రమేషు,కోడూరు జగన్, మొక్క, నరీ, పెండకట్ల, రాంబాబు, సాయం, రమేష్, గడ్డం, సుధాకర్, పాయం, నరేష్, తదితరులు పాల్గొన్నారు.