
వనపర్తి నేటిదాత్రి :
వనపర్తి పట్టణంలో 18 వ వార్డులో రిటైర్డ్ ఐపీఎస్ నాగర్ కర్నూల్ పార్లమెంట్ టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పట్టణ టిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి గంధం పరంజ్యోతి ఆధ్వర్యంలో నిర్వహించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశారని వనపర్తి జిల్లా కేంద్రంలో నల్లచెరువు తాళ్లచెరువు రోడ్ల విస్తరణ కలెక్టర్ కార్యాలయం ఎస్పీ కార్యాలయం మిషన్ భగీరథ నీళ్లు గణపురం చెరువులు నింపడం ప్రతి ఎకరాకు సాగునీరు అందించడం మెడికల్ కాలేజ్ జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజ్ హైదరాబాద్ రోడ్డులో ప్రభుత్వ ప్రసూతి చిల్డ్రన్ హాస్పిటల్ ఏకో పార్కు వ్యవసాయ మార్కెట్ యార్డ్ సమీకృత మార్కెట్ యార్డ్ పాల కేంద్రం దగ్గర వేస్టేజ్ మార్కెట్ సిసి రోడ్లు డ్రైనేజీ ల నిర్మాణం మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ సహకారంతో అభివృద్ధి చేశారని గుర్తు చేశారు . భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి చేసేది ఉన్నదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను నాగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా ఎంపీగా గెలిపిస్తే కేంద్రంతో నిధులు తెచ్చి పెండింగ్ లో ఉన్న రైల్వే స్టేషన్ వనపర్తి పట్టణంలో రోడ్ల విస్తరణ పనులకు కృషి చేస్తారని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ద్వారపోగు వెంకటే ష్ ద్వారపోగు మదిలేటి ద్వార పోగు నరసింహ అడ్డాకుల రాములు గొర్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు