“TRP Leaders Submit Petition to MRO Demanding BC Sub Plan”
ఎమ్మార్వో కు వినతి పత్రం ఇచ్చిన టి ఆర్ పి నాయకులు
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలం కేంద్రంలోబుధవారం రోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీ టిఆర్పి చీఫ్ తీన్మార్ మల్లన్న ఆదేశానుసారం, జిల్లా అధ్యక్షులు రవి పటేల్ పిలుపు మేరకు బీసీ సప్లాన్ తెలంగాణ రాష్టంలో అమలు చేయాలనీ రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మార్వో ఆర్డీవో లకి వినతి పత్రాలు అందచేశారు.
ఇందులో భాగంగా గణపురం మండల తహసీల్దార్ సత్యనారాయణ స్వామి కి కూడా బీసీ లకి అనాదిగా బడ్జెట్ లో జరుగుతున్న అన్యాయం గురించి వివరించి వెంటనే తెలంగాణ లో బీసీ సప్లాన్ అమలులోకి రావాలని వినతి పత్రం అందచేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో గణపురం మండల అధ్యక్షుడు గండు కర్ణాకర్,బస్వరాజపల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడు అంబటి అశోక్ మండల నాయకులు ఈరగోని తిరుపతి పాల్గొన్నారు
