రోడ్లమీదనే పార్కింగ్,రోడ్ల మీదనే క్రయవిక్రయాలు
పరకాల నేటిధాత్రి
హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలో రానున్న బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పట్టణంలో జనాల రద్దీ బాగా పెరిగిపోయింది.కిరాణా,బట్టల షాపులల్లో జనాలు ఇసుకేస్తే రాలేనట్టుగా ఉంటున్నారు.అయితే సమస్య ఇక్కడే ఏర్పడింది సాధారణంగా జనాలు ఎక్కువగా ఉండటం వల్ల వాహనదారులు మోటారు సైకిల్ లను ఇస్తామచ్చినట్టుగా ఇస్తానుసారంగా షాపుల ముందు పార్కింగ్ చేస్తున్నారు. ఇస్తానుసారా పార్కింగ్ ల వల్ల ఇతర పనుల నిమిత్తం వెళ్లే పాదచారులకు తీవ్ర ఇబ్బందిని గురించేస్తున్నారు.పండ్ల వ్యాపారులు,కూరగాయల వ్యాపారాలు రోడ్లమీదనే క్రయ విక్రయాలు జరుపుతుండటం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి.ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తున్న బాహనదారుల మీద స్థానిక పోలీస్ వారు స్పందించి ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.