కామ్రేడ్ గాజర్ల రవి అలియాస్ గణేష్ చిత్రపటానికి నివాళులర్పించిన
కామ్రేడ్ చంద్రగిరి శంకర్
భూపాలపల్లి నేటిధాత్రి:
జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాల గ్రామానికి చెందిన గాజర్ల రవి ఆలియాస్ గణేష్ ఉదయ్ ఇటీవల జరిగిన ఎన్కౌంటర్ లో మృతి చెందాడు విషయం తెలుసుకున్న కామ్రేడ్ చంద్రగిరి శంకర్ గాజర్ల అశోక్ తో కలిసి గాజర్ల రవి గణేష్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అణగారిన ప్రజల కోసం తన జీవితం అంకితం చేసిన విప్లవ యోధుడు, మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, ఏవోబీ ప్రత్యేక జోన్ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన గాజర్ల రవి అలియాస్ గణేష్ ఉదయ్ మారేడుమిల్లి అల్లూరు సీతారామరాజు జిల్లా ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో మృతి మృతి చెందడం జరిగింది 40 సంవత్సరాలు మావోయిస్టు పార్టీలో పనిచేసే వీర మరణం పొందాడు అని కామ్రేడ్ చంద్రగిరి శంకర్ అన్నారు