తంగళ్ళపల్లి ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో అమరవీరులకు నివాళులు…
తంగళ్ళపల్లి నేటి ధాత్రి…
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో తాడూరుచౌరస్తాలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు సావనపెల్లి బాలయ్య ఆధ్వర్యంలో మాదిగ అమరవీరుల కు నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు ఈరోజు తాడూరుచౌరస్తాలో నివాళులర్పించడం జరిగిందని తెలియజేస్తూ వెంటనే కేంద్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని ప్రభుత్వపరంగా ఎస్సీ వర్గీకరణఅమలు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ అమరవీరులకు నివాళులర్పించారు ఇట్టి కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు సావనపెల్లి బాలయ్య ప్రధాన కార్యదర్శి అవునూరి రమేష్ పసుల దుర్గయ్య గుండేటి రాము సవనపల్లి రాకేష్ గుండు ప్రేమ్ కుమార్ ములిగే శేఖర్ సిరిసిల్ల పరిసయ్య ఎడ్ల రవి కోసపురం సురేష్ పరశురాములు కృష్ణ భగవాన్ శ్రీకాంత్ కృష్ణ అరుణ్ కుమార్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

తంగళ్ళపల్లి పద్మనగర్లో గ్రామంలో పౌర హక్కుల దినోత్సవం… తంగళ్ళపల్లి మండలం పద్మ నగర్ గ్రామంలో స్థానిక గ్రామపంచాయతీ భవనంలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో సమావేశం జరిపి వారికి సంబంధించిన సమస్యలపై తెలుసుకొనిపలు సమస్యలపై చర్చించారు ఇట్టి కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ముడారి పోచయ్య మండల ఆఫీస్ నుండి రాధాకృష్ణ ఎమ్మార్వో ఆఫీస్ నుండి రాధాకృష్ణ విఆర్ఓ వెంకటేష్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.