ప్రొఫెసర్ సాయిబాబా కు ఘన నివాళి

జమ్మికుంట: నేటి ధాత్రి
జమ్మికుంట పట్టణంలో ప్రొఫెసర్ సాయిబాబా కు మానవ హక్కుల వేదిక ఆధ్వర్యంలో క్రోవత్తులతో ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూప్రజాస్వామ్యబద్ధంగావేదికలనుపెట్టి,సమాజాన్ని చైతన్య పరచడం కోసం కృషి చేసిన వ్యక్తి, అర్బన్ నక్సలైట్ గా ద్రోహం మోపి, కనీసం వికలాంగుడు అనికూడాచూడకుండాదుర్భరమైనటువంటి జైల్లో నిర్బంధించడం వలన, అనారోగ్యం పాలయ్యారని పేర్కొన్నారు. 10 సంవత్సరాలు జైలు జీవితం అనుభవించిన తర్వాత, కోర్టులో అతన్ని నిర్దోషి అని నిర్ధారించినప్పటికీ అతనిని మానసికంగా ప్రభుత్వం చేసిన హత్యనిఅనివిమర్శించారు.సాయిబాబా గత కొన్ని రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అనారోగ్యముతో జీవితాన్ని ముగించడం ప్రజాస్వామ్యవాదులకు తీరనిలోటు అని వక్తలు పేర్కొన్నారు. ప్రజా సంఘాలకు మద్దతు తెలుపుతూ తెలంగాణ కోసం మొదటిసారిగా వరంగల్ డిక్టరేషన్ లో మద్దతు తెలుపడం జరిగిందని, పీడిత , తాడిత , ఆదివాసుల హక్కుల కోసం నిరంతరం కృషి చేసాడని, తెలంగాణ వాదిని కోల్పోవడం చాలా బాధాకరమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మానవ హక్కుల వేదిక రాష్ట్ర కార్యదర్శి తిరుపతయ్య, కార్మిక నాయకుడు సామ్రాజ్యం, డిటిఎఫ్ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు ఆవాల నరహరి , గాయకులు భరత్ , మర్రి అవినాష్,ఏబూసి శ్రీనివాస్, ప్రజా ఐక్యవేదిక సంఘల నాయకులు పాత సత్యం, ఓల్లాల శ్రీనివాస్, మారేపెళ్లి మొగిలి, దొడ్డే సమ్మయ్య , నాయకులు పాల్గొని ప్రొఫెసర్ సాయిబాబా మరణం దేశానికే తీరని లోటుఅని ఘన నివాళులు అర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!