ఈ రోడ్డును కాపాడేదెవరు
శాయపేట నేటి ధాత్రి:
శాయంపేట మండలంలోని కుమ్మరి వాడనుండి కొత్తగట్టు సింగారం నుండి వెళ్లే దారి చెట్ల పొదలతో మూసుకుపోయింది. బుధవారం రాత్రి కురిసిన వర్షానికి రోడ్డు ప్రక్కల ఉండే చెట్లు విరిగి రోడ్డుకు అడ్డంగా నిలిచిపోయాయి దీంతో రోడ్డు దారి కనిపించకుండా పోయింది. రోడ్డుకి ఇరువైపులా పొదలు పెరిగి దారి కనిపించని స్థితికి చేరింది. అటువైపు వెళుతున్న వాహనదారులు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వచ్చే వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని రోడ్డుకు ఇరువైపులా ఉన్న పొదలను తీసివేయాలని. రైతులు వాహనదారులు కోరుతున్నారు.