గంట్లకుంటా గ్రామంలో పల్లెబాటలో పాల్గొన్న TPCC YS !

గంట్లకుంటా గ్రామంలో పల్లెబాటలో పాల్గొన్న టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి ఝాన్సి రాజేందర్ రెడ్డి గారు..

 

 

 

పెద్దవంగర మండలంలోని గంట్లకుంటా గ్రామంలో నిర్వహించిన పల్లెబాట కార్యక్రమంలో పాలకుర్తి నియోజకవర్గ ఇంచార్జ్, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి ఝాన్సి రాజేందర్ రెడ్డి గారు పాల్గొన్నారు. గ్రామ ప్రజలతో నేరుగా మమేకమై, వారి జీవన పరిస్థితులు, అవసరాలు, సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు..

గ్రామస్తులు వారికి ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో మహిళలు, యువత, వృద్ధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజలు తాగునీటి సమస్య, పింఛన్లు, రోడ్ల పరిస్థితులు, ఆరోగ్య సదుపాయాలపై తమ అభ్యర్థనలు వివరించారు..

 

 

 

 

 

ఈ సందర్భంగా శ్రీమతి ఝాన్సి రాజేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ.. గంట్లకుంటా గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి మీరు చూపిస్తున్న ఆదరణ, విశ్వాసం నా బాధ్యతను పెంచింది. ఈ గ్రామాన్ని ఎమ్మెల్యే శ్రీమతి యశస్విని రెడ్డి గారి సహకారంతో అన్ని విధాల అభివృద్ధి చేస్తాం. రహదారులు, నీటి సౌకర్యాలు, ఆరోగ్య కేంద్రం వంటి మౌలిక వసతులపై కృషి కొనసాగుతుంది. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులనే గెలిపించుకోవాలి. మనకు అభివృద్ధి కావాలంటే మన పార్టీకి ఓటు వేయాలి. నేడు మీరు చూపిన ప్రేమను రేపు ఓటుగా మార్చాలి. ఈ పల్లెబాట ద్వారా ప్రజల గుండెల్లో స్థానం సంపాదించడమే లక్ష్యం..

పాలకుర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి మా నాయకత్వం నిరంతరం శ్రమిస్తోంది. ప్రతి ఒక్క కుటుంబం అభివృద్ధి పథంలో నడవాలి అనేది మా పార్టీ సంకల్పం అని అన్నారు..

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు, మహిళా సంఘాలు, యువత, స్థానిక ప్రజలు భారీగా పాల్గొన్నారు. పల్లెబాట పర్యటన ప్రజల ఉత్సాహంతో విజయవంతంగా ముగిసింది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!