భాద్యతలు చేపట్టిన టౌన్ సీఐ రఘు.
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట పట్టణ సీఐగా లేతాకుల రఘు బుదవారం నూతనంగా భాద్యతలు చేపట్టారు.నర్సంపేట పట్టణ సీఐగా భాద్యతలు నిర్వర్తించిన సీఐ రమణమూర్తి వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సీసీఎస్ కి బదిలీపై వెళ్ళారు.కాగా అక్కడే విధులు నిర్వర్తిస్తున్న సీఐ రఘు నర్సంపేట పట్టణం సీఐగా నియమితులను చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.కాగా లేతాకుల రఘు పట్టణ సిఐగా పోలీస్ స్టేషన్ లోని తన కార్యాలయంలో భాద్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా సీఐ రఘు మాట్లాడుతూ
శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని అన్నారు.లా అండ్ ఆర్డర్ పై ప్రత్యేకంగా నిఘ ఉంచడం జరుగుతుందని తెలిపారు. మత్తుపదర్థాలు,గంజాయి,గుట్కా,అంబర్ లాంటి నిషేధిత పదార్థాలపై ఎప్పటికప్పుడు అన్వేషణ ఉంటుందని సీఐ రఘు తెలిపారు.ముందుగా భాద్యతలు చెకట్టేందుకు వచ్చిన సీఐ రఘుకు ఎస్సైలు, సిబ్బంది పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు.