టాయిలెట్స్ లేక ప్రజల ఇబ్బందులు
మందమర్రి నేటి ధాత్రి
టాయిలెట్స్ లేక ప్రజలు ఇబ్బంది పడుతున్న పట్టించుకోరా ఎమ్మెల్యే గారు
మూడు నెలల్లో ఓపెనింగ్ అంటిరి
ముల్కల్ల రాజేంద్రప్రసాద్ బహుజన్ సమాజ్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు
చెన్నూరు శాసన సభ్యులుగా ఎన్నికైన అనంతరం మందమర్రి మార్కెట్ లో గల ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ప్రజల సౌకర్యార్థం గత సంవత్సరం జనవరి 21వ తేదీన చెన్నూరు శాసనసభ్యులు గడ్డం వివేక్ గారు టాయిలెట్స్ కి శంకుస్థాపన చేసి మూడు నెలల్లో ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పిన మీరు టాయిలెట్స్ లేక ప్రజలు ఇబ్బంది పడుతున్న పట్టించుకోరా అని ప్రశ్నించారు బహుజన సమాజ్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు ముల్కల్ల రాజేంద్రప్రసాద్.
వెంటనే టాయిలెట్స్ పనులు పూర్తి చేసి ప్రజ వినియోగంలోకి తేవాలన్నారు, లేనియెడల మందమర్రి పట్టణ ప్రజలతో కలిసి నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు ముల్కల్ల రాజేంద్రప్రసాద్.