నేటి ధాత్రి ఎఫెక్ట్.. గినియర్ పల్లిని సందర్శించిన ఎంపీడీవో
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం : ఆదివారం “వర్షాకాలం పొంగుడు, ఎండాకాలం ఎండుడు” అనే శీర్షికతో” నేటి ధాత్రి” లో వచ్చిన కథనానికి ఝరాసంగం మండల అభివృద్ధి అధికారి సుధాకర్ స్పందించారు.మంగళవారం గ్రామ పంచాయతీ కార్యదర్శి,సిబ్బందితో కలిసి గ్రామాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.గ్రామంలో నెలకొన్న నీటి సమస్య పై గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు.గ్రామంలో ఎన్ని సంవత్సరాల నుంచి ఈ విధంగా జరుగుతోందని గ్రామస్తులను అధికారులు అడిగి తెలుసుకున్నారు.