ఎమ్మెల్సీ, హుజురాబాద్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి
జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి :
జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అవరణలో శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకు నిర్వహించే భారీ బహిరంగ సభకు ముఖ్య అతిధిగా ముఖ్యమంత్రి కేసిఆర్ హజరవుతున్న నేపద్యంలో నియోజకవర్గ పరిధిలోని బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో తరలిరావాలని ఎమ్మెల్సీ, హుజురాబాద్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి సభాస్థలికి సంబంధించిన ఏర్పాట్లను గురువారం మధ్యాహ్నం అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డితో పాటు మాజీమంత్రి పెద్దిరెడ్డి, మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, రాష్ట్ర టూరిజం డవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ తదితరులు పరిశీలించి.. అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను సమీక్షించారు. సమావేశానికి వచ్చేఅటువంటి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండ అవసరమైన చర్యలు చేపట్టడం పై సమీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలందరిని ఆకట్టుకున్నాయని. ఎన్నికల నేపద్యంలో జమ్మికుంట పట్టణంలో నిర్వహించే భారీ బహిరంగ సభకు సుమారు లక్ష వరకు ప్రజలు హజరయ్యే నేపథ్యంలో సభకు హజరయ్యేవారికి ఇబ్బందులు కలుగకుండ అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. జమ్మికుంటలో జరిగే సమావేశానికి నియోజకవర్గ వ్యాప్తంగా వాహనాలలో వచ్చే వారికి ఇబ్బందులు తలెత్తకుండ ఎక్కడికక్కడ ఎర్పాట్లు చేశామన్నారు. వీణవంక మండలం నుంచి వచ్చే వారి పహనాలను వినాయక గార్డన్ మీదుగా కొత్త వ్యవసాయ మార్కెట్ కు తరలిస్తున్నట్లు చెప్పారు. జమ్మికుంట, ఇల్లందకుంట మండలాల నుండి వచ్చే వాహనాలకు బాయ్స్ హై-స్కూల్ మీదుగా కొత్త వ్యవసాయ మార్కెట్కు తరలించడం జరుగుతుందన్నారు. కమలాపూర్, హుజురాబాద్ మండలాల నుంచి వచ్చే వహనాలను బొమ్మల గుడి మీదుగా పాత వ్యవసాయ మార్కెట్కు పంపించడం జరుగుతుందన్నారు. వీటిని గమనించి ఆయా మండలాల నుంచి వచ్చే ప్రజలు ఇబ్బందులు తలెత్తకుండ ముందస్తు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఎన్నికల నేపద్యంలో ప్రవేషపెట్టిన మేనిఫెస్టో అందరికి ఆమోదయోగ్యంగా ఉందని. మేనిఫెస్టోను గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఓటర్లందరికి అర్థం అయ్యో విధంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు వివరించడం జరిగిందని. ఈ నేపద్యంలో మేనిఫేస్టో పై విశేష స్పందన వస్తుందన్నారు. సమావేశానికి కూడా ఆదే స్థాయిలో భారీ సంఖ్యలో ఒటర్లు హజరయ్యే అవకాశం ఉన్న నేపద్యంలో అందరు సమన్వయంతో సభ విజయవంతం చేసేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు టంగుటూరి రాజ్ కుమార్, వర్దినేని రవీందర్ రావు, కనపర్తి లింగారావు, సమ్మరావు, మంద రాజేష్, గుల్లి రమేష్, పర్లపల్లి రమేష్, మొలుగూరి మొగిలి, అంబాల ప్రభు, చిన్నాల శ్రీకాంత్, అంబాల రాజు, ఆవాల తిరుపతి, ఆలేటి శ్రీరామ్, తదితరులు పాల్గొన్నారు.