నేడే నూతన డిసిసిబి బ్యాంక్ ప్రారంభోత్సవం.

చిట్యాల,నేటిధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన డిసిసి బ్యాంకును బుధవారం రోజున భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్ డీసీసీ బ్యాంకు చైర్మన్ మార్నేని రవీందర్ రావు. ప్రారంభించనున్నారు, అని సింగిల్ విండో చైర్మన్ క్రాంతి కుమార్ రెడ్డి తెలిపారు, మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్(డిసిసిబి) ప్రారంభోత్సవం బుధవారం ఉదయం 10గంటలకు ప్రారంభోత్సవం జరుగుతుంది.
ముఖ్య అతిథులుగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి , వరంగల్ డిసిసిబి చైర్మన్ మార్నేని రవీందర్ రావు* హాజరుకానున్నారు.
కావున చిట్యాల, టేకుమట్ల మండలాల ఎంపీపీలు, జడ్పిటిసిలు, రైతుబంధు సమితి కోఆర్డినేటర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, పిఎసిఎస్ డైరెక్టర్లు, టిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరినారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!