ఉన్నత శిఖరాలకు ఎదగాలి.

MLA MLA

ఉన్నత శిఖరాలకు ఎదగాలి.

ఆకాశానికి నిచ్చెన వేద్దాం.

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి.

మహబూబ్ నగర్/ నేటి ధాత్రి

ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని వాటిని సాధించడానికి ఆకాశానికి నిచ్చెన వేద్దామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. మహబూబ్ నగర్ పట్టణంలోని ప్రభుత్వ ఎన్టీఆర్ డిగ్రీ కళాశాలను దేశ్ పాండే ఫౌండేషన్ బృందంతో కలిసి ఆయన సందర్శించారు.

MLA
MLA

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహబూబ్ నగర్ పట్టణంలో ఉన్న రెండు ప్రభుత్వ డిగ్రీ కళాశాలను బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ గా తెలంగాణ రాష్ట్రం లోని డిగ్రీ కళాశాలలో ప్రథమ స్థానంలో నిలపాలన్నదే తన ఆశయం అన్నారు. చివరి సంవత్సరం డిగ్రీ చదువుతున్న 500 విద్యార్థులకు మందికి దేశ్ పాండే ఫౌండేషన్ ఆధ్వర్యంలో రీజనింగ్, ఇంగ్లీష్ మరియు కంప్యూటర్ లలో శిక్షణ ఇస్తారని, వారు డిగ్రీ పూర్తి చేసిన వెంటనే ఏదేని సంస్థలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు దేశ్ పాండే ఫౌండేషన్ వారి శిక్షణ మీకు ఉపయోగపడుతుంది అని ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, దేశ్ పాండే ఫౌండేషన్ బృందం ప్రవీణ్ ముత్యాల, శేఖర్, విశ్రాంత ప్రిన్సిపాల్ మురళీమోహన్, ఎన్టీఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రోఫెసర్ వి.రాజేంద్రప్రసాద్, నాయకులు బుద్దారం సుధాకర్ రెడ్డి, గుండా మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!