TNJGO Leaders Attend Telangana Thalli Statue Unveiling
తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ లో పాల్గొన్న టీఎన్జీవో నాయకులు
మంచిర్యాల,నేటి ధాత్రి:
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమీకృత జిల్లా కార్యాలయలలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మంచిర్యాల జిల్లా ఐడిఓసి లో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో పాటు డీసీపీ భాస్కర్,అడిషనల్ కలెక్టర్ (రెవేన్యూ) పి.చంద్రయ్య పాల్గొని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేశారు.తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం లో టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి, కార్యదర్శి భూముల రామ్మోహన్,కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, అసోసియేట్ అధ్యక్షులు శ్రీపతి బాపురావు,మంచిర్యాల యూనిట్ అధ్యక్షులు నాగుల గోపాల్,మంచిర్యాల జిల్లా ఉపాధ్యక్షులు తిరుపతి,రామ్ కుమార్,కార్యవర్గ సభ్యులు కుమార్,గంగారం,తదితరులు పాల్గొన్నారు.అనంతరం మంచిర్యాల జిల్లా టీఎన్జీవో అధ్యక్షులు గడియారం శ్రీహరి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ప్రజా పాలనలో ప్రభుత్వం తెచ్చే ప్రతి పధకం ప్రజలకు చేరవేయడానికి నిరంతరం టీఎన్జీవో ఉద్యోగులు ముందు ఉంటారని తెలంగాణ రైజింగ్ 2047 లో భాగంగా తెలంగాణలోని ప్రతి నాన్ గెజిటెడ్ ఉద్యోగి,టీఎన్జీవో యూనియన్ నిరంతరం కష్టపడి తెలంగాణ అభివృద్ధికి కృ
