
బస్సు కారు డి ముగ్గురికి గాయాలు.
చిట్యాల, నేటిధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలో అనగా 26 7 2025 రోజున జమ్మికుంట నుండి భూపాలపల్లికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు టిజి 02 జెడ్ 0026 చిట్యాల మండలం లోని కొత్తపేట బస్టాండు వద్ద ఆగి నలుగురు ప్యాసింజర్లను ఎక్కించుకొని అప్పుడే కదులుతున్న సమయంలో గోపాల్పూర్ క్రాస్ నుండి ఒక షిఫ్ట్ కారు ఏపీ 36 ఎక్స్ 9797 అది వేగంగా అజాగ్రత్తగా వచ్చి ప్రభుత్వ బస్సు యొక్క కుడివైపున బలంగా ఢీకొనడంతో బస్సులో ఉన్న ఒక వ్యక్తి మోకాలికి గాయం అయిందని కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులకు కూడా గాయాలు అయినాయి అని అట్టిబస్ డ్రైవర్ (హుజురాబాద్ బస్ డిపో లో ఆర్టీసీ డ్రైవర్) గా పని చేస్తున్న గోలి జనార్ధన్ సన్నాఫ్ పోశెట్టి అను వ్యక్తి దరఖాస్తు ఇచ్చి అజాగ్రత్తగా వచ్చి ప్రభుత్వ బస్సును ఢీకొట్టడంతో బస్సు యొక్క బంపర్ హెడ్లైట్ బాడీ డ్యామేజ్ అయిందని కావున అందుకు కారకులైన కారు డ్రైవర్ (గట్టు రఘు నైన్ పాక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు) పై తగు చట్టారిత చర్యలు తీసుకోవాలని కోరగా చిట్యాల ఎస్ఐ జి శ్రవణ్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.