వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తున్న వనపర్తి జిల్లాలో ప్రైవేట్ స్కూల్స్ ను తరిమి వేయాలి
ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు సతీష్ యాదవ్
వనపర్తి నేటిధాత్రి :
వనపర్తి జిల్లా వనపర్తి పట్టణంలో కార్పొరేట్ సంస్థల పేరుతో ప్రైవేట్ స్కూల్స్ యజమాన్యాలు వివిధ రకాల కలర్ బ్రోచర్స్ తో ప్రచారాలు నిర్వహిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను మభ్యపెట్టి ప్రైవేట్ స్కూల్స్ లో చేర్పిస్తున్నారని వనపర్తి జిల్లా అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షులు జిల్లా సతీష్ యాదవ్ తెలిపారు.
వనపర్తి పట్టణం వనపర్తి పట్టణంలో ప్రైవేటు స్కూల్స్ కార్పొరేట్ స్కూల్స్ వారు విద్యార్థుల తల్లిదండ్రులను మభ్యపెట్టి ప్రభుత్వ స్కూల్స్ చేర్పించే వారిని తరిమి కొట్టాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా వనపర్తి జిల్లా పరిషత్ హై స్కూల్ సందర్శించారు.
నూతనంగా చేరుతున్న విద్యార్థులను అభినందించారు.
జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు గురురాజును ప్రభుత్వ పాఠశాలలో చేర్చే విధంగా కృషి చేయాలని సూచించారు.
ఈ మేరకు హె చ్ఎం గురురాజును అభినందించారు.
సతీష్ యాదవ్ వెంట అఖిలపక్ష నాయకులు గౌని కాడి యాదయ్య వెంకటేశ్వర్లు బొడ్డుపల్లి సతీష్ రాజనగరం రామస్వామి శ్రీధర్ కృష్ణయ్య నాగరాజ్ రాఘవేందర్ తదితరులు ఉన్నారు.
వనపర్తి పట్టణం వనపర్తి జిల్లాలో ప్రైవేటు స్కూల్స్ లో అంతస్తులు ఉన్నాయని లిఫ్టులు లేవని విద్యార్థులు నోటు బుక్కులు బుక్స్ కలుపుకొని దాదాపు8 కిలోల వరకు ఉండవచ్చని ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ విద్యార్థులు మెట్ల ద్వారా పోవాలంటే ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన పేర్కొన్నారు వెంటనే జిల్లా కలెక్టర్ డిఇఓ వనపర్తి పట్టణం వనపర్తి జిల్లాలో తనిఖీలు నిర్వహించి లిఫ్ట్ లేని స్కూల్స్ ను సీజ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు విద్యార్థులు బుక్కులు నోట్ బుక్స్ మెట్ల ద్వార పోవడం వల్ల విద్యార్థుల నడుములు కాళ్లు నొప్పులు ఏర్పడి అనారోగ్యాల గురయ్యే అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
ప్రభుత్వం డీఈఓ కు టి ఏ లు డి ఏ లు సదుపాయం ఏర్పాటు చేసిందని వెంటనే తనిఖీలు నిర్వహించి విద్యార్థులకు అసౌకర్యాల గురి కాకుండా చర్యలు తీసుకోవాలని సతీష్ యాదవ్ డిమాండ్ చేశారు.