`రేవంత్ రెడ్డి సర్కార్ వార్తలు మోస్తున్న లీకు కాకులు?
`ఎప్పటికప్పుడు వార్తలు చేరవేస్తున్న ద్రోహులు?

`తిన్నింటి వాసాలు అప్పుడే లెక్కపెడుతున్నారు?
`బాధ్యతలు మర్చిపోయి లీకులివ్వడంలో మునిగి తెలిపోతున్నారు?

`పదవులు పొందినా పాత వాసనలు పోలేదు?
`వెనుకటి కోవర్ట్ గుణాలు మానుకోలేదు?

`క్యాబినెట్ ర్యాంక్ లొచ్చినా లోబి తనం పోలేదు?
`నమ్మిన వారికి వెన్నుపోటు మానుకోలేకపోతున్నారు?
`ఇప్పటికే అర్హతకు మించి పదవులు పొందారు?
`పార్టీ ని, ప్రభుత్వాన్ని బ్రష్టు పట్టిస్తున్నారు?
`చీమ చిట్టుక్కు మనక ముందే లీకులు చేరవేస్తున్నారు?
`సీఎం రేవంత్ ను నమ్మించి మోసం చేస్తున్నారు?
`పెద్దలుగా చెలామణి అయ్యి సీఎం రేవంత్ రెడ్డి పక్కన చేరారు?
`పదవులు పొంది ప్రతిపక్షం కోసం పని చేస్తున్నారు?
`ఎవరు నమ్మకస్తులో, ఎవరు కాదో తెలుసుకోలేక రేవంత్ సతమతమౌతున్నారు?
`అధికారులతో అంట కాగుతూ అసలు సమాచారం ముందే సేకరిస్తున్నారు?
`క్షణాలలో ప్రతిపక్షానికి ఉప్పందిస్తున్నారు?
`రహస్యంగా ఉంచాల్సిన వాళ్లే బహిర్గతం చేస్తున్నారు?
`అవసరం లేని విషయాలలో తలదూర్చుతున్నారు?
`బాధ్యతలు పక్కన పెట్టి బద్మాష్ పనులు చేస్తున్నారు?
`మోసగాళ్ళను నమ్మి సీఎం రేవంత్ బాధపడుతున్నారా?
`మంత్రి వర్గంలో కొంత మంది అలాగే వున్నారు?
`ఇద్దరు, ముగ్గురు తప్ప ప్రతిపక్షం విమర్శలకు సమాధానం చెప్పడం లేదు?
`ప్రతి దానికి సీఎం రేవంత్ రెడ్డే సమాధానం చెప్పాల్సి వస్తోంది?
`కోవర్ట్ లే కాంగ్రెస్ కొంప ముంచుతున్నారు?
`కూర్చున్న కొమ్మనే నరుకుంటున్నారు?
`అధికారం లోకి తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి కే ఎసరు పెట్టాలని చూస్తున్నారు?
`ఆదరించి అన్నం పెట్టిన వారికే సున్నం పెట్టే వాళ్ళుంటారు?
`నమ్మించి నట్టేట ముంచే వాళ్ళు నమ్మకంగా నటిస్తారు?
`వాళ్ళు ఎవరో ఇప్పటికైనా సీఎం గుర్తించి పక్కన పెట్టకపోతే కష్టం?
`కాంగ్రెస్ పార్టీ రాజకీయ భవిష్యత్తుకు నష్టం?
హైదరాబాద్, నేటిధాత్రి:
బుద్ది చెప్పాలనకున్నప్ప్పుడు గుద్ది చెప్పినా తప్ప్పులేదని వేమన ఓ పద్యంలో చెబుతాడు. మంచి చెయానుకున్న వారు అలాగే వుండాలి. కాని సమాజంలో మంచి తనం వున్న వాళ్లుంటారు. చెడు గుణం కల్గిన వారుంటారు. ఈ ఇద్దరే కాకుండా మరో రకంగా కూడా వుంటారు. వాళ్లే అవకాశవాదులు. మంచి తనం ముసుగేసుకొని చెడును స్వభావం మెండుగా వున్న వారు వుంటారు. వాళ్ల మాటలు తియ్యగా వుంటాయి. నమ్మేలా వుంటాయి. నంగనాని మాటలు చెప్పినా వినసొంపుగా చెబుతారు. తర్వాత గోతులు తీస్తారు. ఎందుకంటే అబద్దాలు ఎంతో అందంగా వుంటాయి. వినడానికి కూడా చాలా అందంగా వుంటాయి. మంచి మాటలు కొంచెం కటువుగా వుంటాయి. కాని వాటిని వినడానికి చాలా మంది ఇష్టపడరు. అందుకే మంచి తనం ముసుగేసుకున్న వారు దూరి పోతుంటారు. అభినవ నారద మునీంద్రులుగా కనిపిస్తుంటారు. కాని వారు తవ్వే గోతులు తెలుసుకునే లోపు పుణ్యం పూర్తవుతుంది. ఇలాంటి వారిని ముందే గుర్తిస్తేగాని సమాజం బాగు పడదు. వ్యవస్ధలు ముందుకు పోవు. సరిగ్గా ఇలాంటి వారే కాంగ్రెస్ ఫ్రభుత్వంలో చేరిపోయారు. సహజంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బోళా శంÅ£రుడు లాంటి వారు. ఆయనకు అందర్నీ నమ్మడం అలవాటు. దాని వల్ల కూడా ఆయన ఇబ్బందులు ఎదుర్కొన సందర్బాలు గతంలో వున్నాయి. ఇప్ప్పుడు కనిపిస్తున్నాయి. సిఎం. రేవంత్ రెడ్డి ఎంత నిక్కచ్చిగా వుంటారో తెలియంది కాదు. అయినా అలాంటి మంచి మనిషిని కూడా సులువుగా బోల్తా కొట్టించిన వారు కూడా ఆయన చుట్టు కొంత మంది వున్నారు. నిజం చెప్పాలంటే వారిని సిఎం. రేవంత్ రెడ్డి గుడ్డిగా నమ్మారన్న మాటలు కూడా ఇప్ప్పుడు వినిపిస్తున్నాయి. ఎక్కడ నమ్మకం ఎక్కువ వుంటుందో అక్కడే ఎక్కువ మోసానికి తావుంటుందని పెద్దలు ఏనాడో చెప్పారు. ఇప్ప్పుడు అదే నిజమౌతోంది. తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి సూపర్ పవర్ అని తెలిసిన తర్వాత ఆయన వద్దకు చేరిన వారు కొంత మంది వున్నారు. అంతకు ముందు రేవంత్ రెడ్డిని కూడా విమర్శించిన వారు ఆయన చుట్టూ చేరిపోయారు. వారికి అబద్దాలు అల్లడం నోరుతో పెట్టిన విద్య కలిగిన వారున్నారు. వార్తలను సష్టించి నమ్మించడం అలవాటు చేసుకున్నారు. నిజాలు ఎప్ప్పుడూ వారు చెప్పరు. కాని మసిబూసి మారెడు కాయ చేయడంలో సిద్దహస్తులు. అందుకే వారిని సిఎం. రేవంత్ రెడ్డి బాగా నమ్మారని అంటారు. అందులో ఒకరిని రేవంత్ రెడ్డి సిఎం. అయ్యాక తనకు అత్యంత సన్నిహింతగా మెదిలే పదవిలో కూర్చోబెట్టుకున్నారు. అయినా వారిలో ఆశ తీరలేదు. సంపాదన మీద ఆశ చావలేదు. పదవితో వారికి సంతప్తి కలగలేదు. సంపాదన పెరిగే మార్గం కనిపించలేదు. దాంతో కోవర్టు అవతారమెత్తినట్లు తేలింది. వెంటనే అనుమానం వచ్చిన సిఎం. రేవంత్ రెడ్డి ఆ వ్యక్తిని పక్కన పెట్టాలనుకున్నారు. అsదులోనూ సిఎం. తన మంచితనాన్నే చాటుకున్నారు. పూర్తిగా పక్కన పెట్టకుండా ఓ రాజ్యాంగబద్ద పదవి కట్టబెట్టి మరీ దూరం పెట్టారు. ఇక్కడ కూడా సిఎం. రేవంత్ రెడ్డి మంచి తనం ఆ వ్యక్తికి కనిపించలేదు. తన వ్యవహార శైలిని మార్చుకోలేదు. క్యాబినేట్ ర్యాంక్ పదవి ఇచ్చినా ఆ వ్యక్తిలో మార్పు రాలేదు. కాంగ్రెస్ ఇంటి మీద వాలిన కాకి, ప్రతిపక్షాల ఇంటి మీద వాలొద్దన్నంతగా నిక్కచ్చి రాజకీయాలు చేసే రేవంత్రెడ్డికే సవాలు విసిరేటు వంటి పనులు ఆ వ్యక్తి చేస్తున్నట్లు మళ్లీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ వ్యక్తికి తోడుగా మరో అవకాశ వాది కూడా అదే దారిలో నడుస్తున్నట్లు కూడా సమాచారం అందుతోంది. బిఆరఎస్ పదేళ్ల కాలం పాటు అదికారంలో వున్నప్ప్పుడు ఆ వ్యక్తి పదవులు కోరుకున్నా తీరలేదు. పైగా ఆ వ్యక్తి అత్యాశలను గమనించి పార్టీ ఆ వ్యక్తిని తప్పించాలనుకున్నది. అక్కడనుంచి తరిమేసింది. ఒక రకంగా పక్కన పెట్టేసింది . రాష్ట్రంలో ఆ సమయానికి కాంగ్రెస్ పార్టీకి అనుకూల వాతావరణం మొదలైంది. మెల్లిగా ఆ వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా సిఎం. రేవంత్ రెడ్డి వద్దకు చేరుకున్నారు. తాను ఎంత చేసినా బిఆరఎస్ నాయకులు తనకు అన్యాయం చేశారని మొసలి కన్నీళ్లు పెట్టుకున్నట్లు అప్పట్లోనే వార్తలు వచ్చాయి. అలా సిఎం. రేవంత్ రెడ్డికి దగ్గరైనా ఆ వక్తి వల్ల కాంగ్రెస్కు ఒరిగిందేమీ లేదు. ఆ సమయంలో నిర్భయంగా కాంగ్రెస్కు ముందుండి ప్రచారం చేసింది లేదు. కాని నేనున్నాన్నట్లు మాత్రమే వ్యవహరిస్తూనే వచ్చారు. అంటీ ముట్టనట్లే వుంటూ వచ్చారు. పార్టీ ముద్ర తన మీద పడకుండా చూసుకుంటూ వచ్చారు. ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన తర్వాత పార్టీ అధికారంలోకి రావడానికి తన వంతు పాత్ర వుందని చెప్ప్పుకోవడం, సిఎం. రేవంత్ రెడ్డితో పదవి పొందడం అన్నీ జరిగిపోయాయి. అయినా ఆ వ్యక్తికి విశ్వాసం లేదన్న మాటలే ప్రభుత్వ వర్గాలలో వినిపిస్తున్నాయి. కొంత కాలం సిఎం. రేవంత్కు అత్యంత సన్నిహితంగా మెలిగిన వ్యక్తికి, ఈ వార్తలోని మరో వ్యక్తికి మరింత దోస్తానా పెరిగింది. ప్రభుత్వంలో జరిగే ప్రతి విషయాన్ని ఆరా తీయడం, దానిని ప్రతిపక్షాలకు చేరవేయడం మొదలైందని తెలుస్తోంది. ప్రభుత్వం దష్టికి కూడా వచ్చినట్లు సమాచారం. అందుకే ఇటీవల సిఎం. రేవంత్రెడ్డి ఎంత నమ్మకస్తుడైనా సరే మాట వరుసకు కూడా ప్రభుత్వ విషయాలు బైటకు రాకుండా చూసుకుంటున్నారు. ఇదిలా వుంటే మంత్రి వర్గంలో వున్న కొంత మంది మంత్రుల్లో కూడా కోవర్డులున్నారన్న మాటలు వినిపిస్తున్నాయి. సిఎం. రేవంత్ రెడ్డి ప్రజల్లో చులకన కావాలనే చూస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వానికి సంబంధించిన వార్తలు బైటకు వెళ్లినా, ప్రభుత్వం మీద ప్రతిపక్ష బిఆరఎస్ ఆరోపణలు చేస్తున్నా చాలా మంది మంత్రులు సైలెంట్గా వుంటున్నారు. ప్రభుత్వం అబాసుపాలైతే తమ రాజకీయ జీవితం కూడా ఇబ్బందుల్లో పడుతుందన్న ఆందోళన ఆ మంత్రులలో లేకుండాపోతోంది. వచ్చేది కూడా మన ప్రభుత్వమే..మళ్లీకాంగ్రెస్ పార్టీయే గెలుస్తుందని సిఎం. రేవంత్ రెడ్డి చెబుతున్న మాటలను మంత్రులే నమ్మనట్లు వ్యవహరిస్తున్నారు. పట్టింపు లేనట్లు వుంటున్నారు. సిఎం. రేవంత్రెడ్డి మీద ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు తిప్పికొట్టేందుకు మంత్రులు ఎవరూ ముందుకు రావడం లేదు. ప్రభుత్వానికి అండగా ఓ ఇద్దరు ముగ్గరు మంత్రులు తప్ప మిగతా వాళ్లంతా సైలెంట్గానే వుంటున్నారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో కూడా మంత్రులు ఏం పాత్ర పోషిస్తున్నారో కూడా అ ర్ధం కావడం లేదు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కాలుకు బలపం కట్టుకొని ప్రతి ఎన్నికకు తిరుగుతున్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా సిఎం. రేవంత్ రెడ్డి వచ్చి ప్రచారం చేసే వరకు మంత్రులు చొరవ చూపలేదు. అంత వరకు ప్రతిపక్షానికి అనుకూలంగా వున్న వాతావరణాన్ని ఒక్కసారిగా సిఎం. రేవంత్ రెడ్డి మార్చేసి, పార్టీని గెలిపించారు. గత సర్పంచ్ ఎన్నికల్లోనూ ఇదే జరిగింది. ఎవరు ఏమనుకున్నా, సర్పంచ్ ఎన్నికల్లోకూడా సిఎం. రేవంత్ స్వయంగా ప్రచార సభలు నిర్వహించారు. మెజార్టీ సర్పంచ్లను గెలిపించారు. అయినా కొందరు మంత్రుల్లో మార్పు రావడం లేదన్న మాటలే వినిపిస్తున్నాయి. ఇప్ప్పుడు మున్సిపల్ ఎన్నికల్లోనూ సిఎం. రేవంత్ రెడ్డి సభలు నిర్వహించాల్సి వస్తోంది. ఇంత మంది మంత్రులున్నాము..మేం చూసుకుంటామని సిఎం.కు దైర్యం చెబుతున్న వారే కరువౌతున్నారు. జగిత్యాల వంటి జిల్లాలో జరిగుతున్న పార్టీ వ్యతిరేక కార్యక్రమాలపై ఏ ఒక్క మంత్రి మాట్లాడడం లేదు. ఏ ఎమ్మెల్యే స్పందించం లేదు. పదేళ్ల తర్వాత పార్టీని అదికారంలోకి తీసుకురావడానికి సిఎం. రేవంత్ రెడ్డి పడిన శ్రమను అధిష్టానం గుర్తించి ఆయనను సిఎం చేసింది. ఆ మాత్రం కతజ్ఞత కూడా చాలా మందిలో కనిపించడం లేదు. ఇప్ప్పుడు మంత్రులైన వారిలో, ఎమ్మెల్యేలైన వారిలో సిఎం. రేవంత్రెడ్డి చరిస్మా వల్ల గెలిచిన వారే ఎక్కువగా వున్నారు. అయినా వారిలో విశ్వాసం లేకుండాపోతోంది. ఇప్పటికీ ప్రభుత్వంలో లుకలుకలుండాలని కోరుకుంటున్నవారు కూడా వున్నారు. ఓ వైపు ఎన్నిÅ£ల ప్రచారం సాగుతున్న తరుణంలో కాంగ్రెస్ను ఓడించినా సరే, తమకు వచ్చే ఇబ్బందులు లేవని ఎవరైనా అంటారా? అలా అన్నారంటే అర్దమేమిటో ప్రజలకు తెలియదా? సిఎం. రేవంత్కు అర్దం కాకుండా వుంటుందా? ఏది ఏమైనా సరే సిఎం. రేవంత్ రెడ్డి మాత్రమే పార్టీకి రక్షకుడు. అనే నిజాన్ని ఇప్పటికీ, ఎప్పటికీ కాంగ్రెస్ నాయకులు నమ్మితేనే పార్టీకి భవిష్యత్తు!!
