ఈ ప్రిన్సిపాల్ మాకొద్దు. కలెక్టరేట్ వద్ద మేడికోల ఆందోళన

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి

కొత్తగూడెం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో హాస్టల్ విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనితో వారు కళాశాల వద్ద ధర్నా నిర్వహించారు హాస్టల్లో వాటర్ ప్యూరిఫైయర్ చెడిపోవడంతో మంచినీళ్లు బయట నుండి కొనుక్కొని తాగాల్సి వస్తుందని సమాచారం. ఈ నెలలో ఫెస్ట్ ఉండగా తేదీలు ప్రకటించిన తర్వాత ఫెస్ట్ క్యాన్సిల్ చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.విద్యార్థులు ఫెస్ట్ కోసం ఏర్పాటులో చేసుకున్న తరుణంలో ఇలా రద్దు చేయడం పట్ల విద్యార్థులు ఆగ్రహంగా ఉన్నారు. అనేకమంది హాస్టల్ విద్యార్థులకు గొంతు గొంతు నొప్పితో బాధపడుతున్నట్టు సమాచారం. అయినప్పటికీ అధికారులు ఎవరూ దీన్ని పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినబడుస్తున్నాయి.హాస్టల్ విద్యార్థినిలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు సమాచారం. కళాశాలలో నిర్మిస్తున్న హాస్టల్ అనేక సంవత్సరాలుగా పునాదుల దశలోనే ఆగిపోయి ఉంది. విద్యార్థినిలను పాలంచలోనే నటరాజ్ సెంటర్లో ఉన్న ప్రైవేట్ భవనంలో హాస్టల్ నడుపుతున్నారు.తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఎట్టకేలకు విద్యార్థులు ధైర్యం చేసి సోమవారం కళాశాల ముందు కూర్చున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!