భూపాలపల్లి ప్రజలు ఆలోచించి ఓటు వేయాలి
ఆరు గ్యారెంటీ ల పేరుతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ
మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 25వ వార్డులో భూపాలపల్లి పట్టణ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కటకం జనార్దన్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన బస్తీ బాట కార్యక్రమంలో పాల్గొన్న భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి వరంగల్ జిల్లా జడ్పీ మాజీ ఛైర్పర్సన్ & జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి బిఆర్ఎస్ పార్టీ పాల్గొన్నారు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
ఒక్కసారి మనం ఆలోచన చేయాలి ఓటు కు ఉండే ప్రాముఖ్యత మీరు గుర్తించాలి
నేను మొదటి సారి ఎమ్మెల్యే అయినప్పుడు హన్మకొండ నుండి భూపాలపల్లికి రావాలంటే పెద్ద పెద్ద బొందలు ఉన్న రోడ్లు ఉండే… మరీ ఆ రోడ్డే అలా ఉంటే మన భూపాలపల్లి పరిస్థితి ఏంటో ఒక్కసారి ఉహించుకోండి.
నేను బస్సులో, కారులో నేను వస్తుంటే సార్ ఇగో మా రోడ్లు అని ప్రజలు చూపెడుతుండే.
భూపాలపల్లిని సరిగ్గా అభివృద్ధి చేయాలని ఆలోచన చేసి గ్రామ పంచాయతీ గా ఉన్న భూపాలపల్లిని నగర పంచాయతీ చేసి కొన్ని గ్రామాలను భూపాలపల్లి లో కలిపి మున్సిపాలిటీ చేయడం జరిగింది.
దాని వల్ల భూపాలపల్లి ఒక్క జిల్లా స్థాయికి ఎదిగింది జిల్లా కేంద్రం అయిన భూపాలపల్లి పై ఎందుకో రేవంత్ రెడ్డి కి కళ్ళు మండుతున్నాయి. ఇన్ని జిల్లాలు అవసరం లేదని మేడారంలో మంత్రివర్గ సమావేశం పెట్టి జిల్లాలను కుదించేందుకు ఒక్క కమిటీ ఏర్పాటు చేసిన జిల్లాల్ని తొలగించే దాంట్లో మొదటి జిల్లా భూపాలపల్లి అనే విదంగా చేసిండు.

ముఖ్యమంత్రికి పరిపాలన చేసే శక్తి లేదు,ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేసే ధైర్యం లేదు.
మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన గోదావరి జలాలు ప్రతి ఇంటికి వచ్చినాయి, రోడ్లు, సైడ్రైన్స్ ప్రజలకి మెరుగైన సౌకర్యాలు వచ్చినాయి.
జిల్లా అయింది కాబట్టి భూపాలపల్లికి మెడికల్ కాలేజీ వచ్చింది.
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని 100 పడకల ఆసుపత్రి నిర్మించి ప్రతి రోజు వైద్య సేవలు ఎలా ఉన్నాయో అని ప్రతి నెలకి ఒక్కసారి హాస్పిటల్ విజిట్ చేశాము కానీ
జిల్లా కలెక్టర్ కి విజ్ఞప్తి చేసిన మీ పక్కనే ఉన్న హాస్పిటల్ ఒక్కసారి విజిట్ చేయమని కోరినం, అది చేత కాకపోతే ఒక్క స్పెషల్ ఆఫీసర్ వేయమని కోరిన కనీసం పట్టించుకోవడం లేదు.
ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ది చెప్పాలి అంట మీ అమూల్యమైన ఓటు బిఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపై వేసి కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించండి అని వారు అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
