"Industries Pollution Threatens Kesamudram Residents"
ఈ పరిశ్రమలతో మా ప్రాణాలకు ముప్పు…!
పరిశ్రమ నుండి వచ్చే దుమ్ము ధూళి తో చిన్నపిల్లలు అనారోగ్య పాలవుతున్నారు
జననివాసాలు ఉండే చోట ఈ పరిశ్రమలు ఏంటి…?
ఈ పరిశ్రమల కాలుష్యంతో మేము ఉండాలా…? పోవాల్నా…?
ఎం ఆర్ పి ఎస్ మండల అధ్యక్షులు కొమ్ము నాగరాజు
కేసముద్రం/ నేటి ధాత్రి
కేసముద్రం మున్సిపాలిటీ కేంద్రలో శనివారం ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు కొమ్ము నాగరాజు మాట్లాడుతూ,
కేసముద్రం మండల కేంద్రంలో చైతన్య నగర్ కాలనీకి ప్రక్కన జన నివాసాలు ఉన్నచోట ఇండస్ట్రీస్ ఉడుకేత మిల్లులు రైస్ మిల్లులు పత్తి మిల్లులు కొత్తగా నిర్మాణం చేస్తూ ప్రజలకు చిన్న పిల్లలకు హానికరమైన కంటికి కనబడని కాటన్ ముక్కులోకి నోట్లోకి వెళ్లి చిన్నపిల్లలు అనారోగ్యం బారిన పడేలా హాని కలిగిస్తున్నాయని, అదేవిధంగా ఉడుకేత మిల్లుల ద్వారా నల్లటి దుమ్ము త్రాగే నీళ్లలో ఇంటి ముందు రోజు వాడుకునే నీళ్లలో అలాగే రాత్రిపూట ఆరు బయట నిద్రిస్తే తెల్లవారేసరికి మనిషి మీద మొత్తం నల్లటి దుమ్ము దూళి వడ్ల పొట్టు.ఉనుకా తూర్పారబోసినట్టుగా వెదజల్లుతున్నాయని కాలనీ ప్రజల ఊపిరితిత్తుల వ్యాధి బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.అదేవిధంగా ఇండస్ట్రీకి వెళ్ళవలసిన భారీ లారీలు ట్రాక్టర్లు జెసిబి లు ఇండస్ట్రీకి ఎగుమతులు దిగుమతులు చేసుకునేందుకు పెద్ద పెద్ద వెహికల్స్ మొత్తం కాలినికివెళ్ళేదారినుండి దురుసుగా స్పీడ్ గా వెళుతూ కాలనీవాసులు రోడ్డుమీదికి రావాలంటే ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని బయటకు రావాల్సి వస్తుంది అన్నారు. గత 30 40 ఏళ్లుగా ఈ కాలనీలో నివసిస్తున్న ప్రజలకు ముఖ్యంగా చిన్నారులకు ఎలాంటి వ్యాధుల బారిన పడకుండా సంబంధిత శాఖ వారు మరియు ఇండస్ట్రియల్ ఆఫీసర్లు అందరూ వీటిపైన చర్యలు తీసుకుని కాలనీవాసులకు న్యాయం చేయాలని వారు తెలిపారు.అప్పటికి చర్యలు తీసుకొని పక్షంలో ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకత్వంతో. కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల్ నాయకులు కొమ్ము సునీల్ ఎమ్మార్పీఎస్.గ్రామ నాయకులు కొమ్ము నిఖిల్ వల్లందాస్ మురళి పెండల అశోక్ కొమ్ము రమాకాంత్ కొమ్ము భరత్ పెండేలా బన్నీ సోమారపు రఘు తదితరులు పాల్గొన్నారు.
