డ్రైనేజీ లేక ప్రజలు అస్తవ్యస్తం……రోడ్లపైనే మురుగునీరు

మమ్మల్ని ప్రభుత్వమే ఆదుకోవాలి

శాయంపేట నేటి ధాత్రి:

శాయంపేట మండలకేంద్రం కూడలి నుండి ఆత్మకూరుకు వెళ్లే దారిలో డ్రైనేజ్ లేకుండానే రోడ్డు నిర్మాణ పనులు పూర్తిచేసిన అధికారులు రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.దీనికితోడు వర్షాలు కురుస్తుండడంతో రహదారుల పైకి మురుగునీరు వచ్చేస్తోంది.అలాగే డ్రైనేజీ లేక వ్యర్థాలు నివాస గృహంలోకి చొచ్చుకవస్తుంది స్థానిక ప్రజలు పడరాన్ని పాట్లు పడుతు న్నారు.చిన్నపాటి వర్షంవస్తే చాలు వరద నీరు రోడ్లపైకి ఏరులై పారుతుంది దీనికి తోడు భరించలేని దుర్వాసన వెదజ ల్లడంతో ప్రజలు ప్రత్యక్ష నరకంగా జీవనం కొనసాగి స్తున్నారు ఇప్పటికైనా మండల కేంద్రంలో డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని గ్రామ ప్రజలు కోరుచున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!