There is a shortage of laborers to pick cotton... laborers are available...!
పత్తి ఏరేందుకు కూలీల కొరత…..కూలీలు దొరుకుతలే…!
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గంలో ఆయా మండల ఝరాసంగం మొగుడంపల్లి కోహిర్ న్యాల్కల్ గ్రామాలలో పత్తి ఏరేందుకు కూలీలు ఇతర నుంచి కూలీలను వలసకు తీసుకొచ్చి పనులు చేయిస్తున్నా రు. వారు సైతం అనుకున్న స్థాయిలో దొరకకపోవ డంతో పత్తి రైతులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు. వలస కూలీలతో పనులు చేయించడం వల్ల వారికి స్థానికంగా నివాసాలు ఏర్పాటు చేసి ఇతరత్రా సౌకర్యాలు ముందుగానే సమకూర్చాల్సి ఉంటుంది. దీంతో పత్తి రైతులకు ఖర్చులు తడిసిమోపడవుతున్నా యి. ఏటా జిల్లాలో పత్తి పంట సాగు గణనీయంగా తగ్గుతూ వస్తోంది. కూలీల కొరత వల్ల కొందరు రైతులు పత్తి జోలికి వెళ్లడం లేదు. ఓ వైపు కూలీల సమస్యలు మరోవైపు వర్షాలు, రోజు కురుస్తున్న వర్షాలతో మునిగిన పంటలు ఇవన్నీ పత్తి రైతుల ఆర్థిక పరిస్థితులపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. సరైన దిగుబడి లేక పెట్టిన పెట్టుబడి సైతం చేతికొచ్చే పరిస్థితి కనిపించడంలేదు. పత్తి పంటను నమ్ముకు న్న రైతులు ప్రస్తుత పరిస్థితుల్లో వలస కూలీల ఆర్థిక భారాన్ని భరించడం తప్ప చేసేదేమీలేదు..
అడ్వాన్స్ ఇస్తేనే..

పత్తి ఏరేందుకు వలస కూలీలకు అడ్వాన్స్ ఇస్తేనే పనులకు వస్తున్నారు. ఏపీ నుంచి అనంతపురం, శ్రీకాకుళం, కర్నాటక ప్రాంతం నుంచి వలస కూలీలను తీసుకొస్తున్నారు. వారికి గుడారాలు, నిత్యావసర సరుకులకు అవసరమైన డబ్బు ముందే ఇవ్వాల్సి ఉంటుంది. అలా ఇస్తేనే ఒప్పందం ప్రకారం కూలీలు పనులకు వస్తున్నారు. ఈ భారం అంతా రైతులపై పడడంతో పాటు దిగుబడి తగ్గి గిట్టుబాటు కావడం లేదని బాధిత రైతులు ఆందోళన చెందుతున్నారు.
