భగత్ సింగ్,రాజగురు, సుఖదేవుల ఆశయ సాధన కోసం యువత యువకులు పోరాడాలి

పి వై ఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పర్శక రవి

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :
ఈ దేశము నుండి బ్రిటిష్ సామ్రాజ్యవాదులు వెళ్లిపోవాలని, ఈ దేశం కు నిజమైన స్వతంత్రం రావాలని ఉరి కంబాని ముద్దాడిన షాహిద్ భగత్ సింగ్, రాజగురు, సుఖదేవుల ఆశయ సాధన కోసం యువత పోరాడాలని ప్రగతిశీల యువజన సంఘం (పివైఎల్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి పర్శక రవి పిలుపునిచ్చారు.
శనివారం మండలంలోని చీమలగూడెం, ముత్తాపురం, నడిమిగూడెం, పోతిరెడ్డిగూడెం తదితర గ్రామాల్లో జరిగిన భగత్ సింగ్,రాజగురు,సుఖదేవుల 93వ వర్ధంతి సందర్భంగా తను మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం పాసిజం పేరుతో మతాల మధ్య, కులాల మధ్య చిచ్చులు పెడుతూ తన పబ్బం గడుపుతుందని అన్నారు.
2019 సంవత్సరం లోక్సభ ఎన్నికల సందర్భంగా దేశంలో అధికారంలోకి వస్తే యువతకు సంవత్సరానికి కోటి ఉద్యోగాలు ఇస్తామని నమ్మ బలికారని, అధికారంలోకి వచ్చినంక ప్రభుత్వ రంగ సంస్థలైన ఎల్ఐసి, రైల్వే,
ఓడరేవులు, బ్యాంకులో మొత్తం ప్రైవేట్ పరం చేసి అందులో పనిచేస్తున్న ఉద్యోగులను రోడ్డుపాలు చేశారని విమర్శించారు.
రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, నిరుద్యోగ భృతి అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రగతిశీల యువజన సంఘం( పివైఎల్) జిల్లా నాయకులు అటికం శేఖర్, ఎనగంటి లాజర్, గుండాల మండల అధ్యక్షులు తాటి రమేష్, మోకాళ్ళ ప్రసాద్, బుక్య వెంకన్న, కల్తీ ప్రభాకర్, పూసం కృష్ణ, బన్సీలాల్, ఈసం సుధాకర్, చింత కోటేష్, కల్తీ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!