పరకాలలో శూన్య నీడ ప్రయోగం చేసిన యాక్ టీమ్

పరకాల నేటిధాత్రి
మనం ఎండలో ఎక్కడికి వెళ్లినా,నిల్చున్నా,కూర్చున్నా మన నీడ మనకు కనబడుతోంది అయితే సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్న క్రమంలో ఏడాదికి రెండుసార్లు సూర్యుని కిరణాలు మనిషికి నడి నెత్తి మీద పడుతూ రెండు మూడు నిముషాలు నీడ మాయమవుతుంది.దీనిని శూన్య నీడ దినం అంటారు. అయితే ఈ ఏడాది మే 9న గురువారం కూడా మధ్యాహ్నం12 గంటలకు శూన్య నీడ దినం గా పరకాలలో గ్రంథాలయం వద్ద యూత్ ఫర్ యాంటీ కరప్షన్ టీమ్ కూడా ఆ విషయాన్ని ప్రయోగాత్మకంగా చూపించారు.ఇలా శూన్య నీడ దినోత్సవం రోజున నీడ కనపడక పోవడం సరదాగా అనిపించింది అని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ వరంగల్ రీజనల్ అధ్యక్షుడు.సూర. రాజేందర్ అన్నారు.ఈ కార్యక్రమంలో యాక్ సభ్యులు నూతన్ కుమార్, యాట.రాజేందర్,కుమార్, విశ్వనాథం,గ్రంథ పాలకుడు. రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *