పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.
నల్లబెల్లి నేటి ధాత్రి:
పేదల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మండల పార్టీ అధ్యక్షుడు చిట్యాల తిరుపతిరెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని గ్రామ పార్టీ అధ్యక్షుడు బత్తిని మహేష్ ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇండ్ల ముగ్గు పోసే కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు ప్రోసిడింగ్ పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకొని నిర్దిష్ట సమయంలో ఇండ్లను పూర్తి చేయాలని ఆయన అన్నారు కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.