నస్పూర్ గ్రామంలో అంగరంగ వైభవంగా శ్రీ సీతారాములవారి కల్యాణ మహోత్సవం
ముఖ్య అతిథులుగా లోపాల్గొన్న మంచిర్యాల డిసీపి భాస్కర్ మంచిర్యాల రూరల్ సి ఐ అశోక్ కుమార్
నస్పూర్ నేటిదాత్రి
నస్పూర్ గ్రామంలోని అతి పురాతనమైన శ్రీ సీతారామాలయంలో సీతారాముల వారి కళ్యాణం అత్యంత వైగోపేతంగా కన్నుల పండుగా జరిగినది ఈ సందర్భంగా గ్రామ నాయకులు ప్రజలు ఆలయ కమిటీ ఆలయ అర్చకుల సమక్షంలో సీతారాములవారి కల్యాణం జరిపించడం జరిగినది సకలజనులు శ్రీరామచంద్రమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొంది సుఖసంతోషాలతో వర్ధిల్లాలని వేదపండితులు దేవరాజు రంజిత్ శర్మ మంత్రోచ్ఛారణతో ప్రజలను ఆ శ్రీరామచంద్రుడు ఆశీర్వదించే విధంగా మంత్ర వేదాలతో గ్రామ ప్రజలు సుభిక్షంగా ఉండాలని రాములవారి కళ్యాణాన్ని జరిపించారు

అదేవిధంగా శ్రీరామచంద్ర మూర్తి వారి యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ తల్లిదండ్రుల పట్ల రాములవారు ఎంతటి విధేయత కలిగి ఉండేవారో వివరించారూ భక్తులందరూ శ్రీరాముని తల్లిదండ్రులను గౌరవించాలని ఆకాంక్షించారు కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా మంచిర్యాల డిసిపి భాస్కర్ మంచిర్యాల రూరల్ సిఐ అశోక్ కుమార్ మరియు ఆలయ కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు సీతారాముల కళ్యాణానంతరం భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరుపబడినది ఇట్టి కార్యక్రమాన్ని రా చకొండ కృష్ణారావు అండ్ బ్రదర్స్ నిర్వహించినారు ఆలయ కమిటీ సభ్యులు రాచకొండ గోపాలరావు రాచకొండ వెంకటేశ్వరరావు (బుజ్జన్న) మార్కెట్ కమిటీ డైరెక్టర్ దొనపల్లి లింగయ్య ఇరికిల్ల పురుషోత్తం గడ్డం సత్యా గౌడ్ కోయిల వెంకటేష్ గరిసె రామస్వామి భీమయ్య సందీప్ బండం గోపాల్ కుందరపు రమేష్ కొయ్యలరమేష్ సిరిపురం శ్రీనివాస్ కిష్టయ్య కమిటీ సభ్యులు పాల్గొన్నారు పాల్గొన్నారు