కళాకారులను ఘనంగా సన్మానించుకున్న లక్ష్మారెడ్డిపల్లి గ్రామస్తులు

భూపాలపల్లి నేటిధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం లక్ష్మారెడ్డి పల్లి గ్రామానికి చెందిన మేడిపల్లి రాజుగౌడ్,మేడిపల్లి వెంకటేశ్వర్లు గౌడ్ ఇద్దరు కళాకారులుగా గత కొన్ని సంవత్సరాలుగా ప్రతిభను నలుదిక్కుల ప్రదర్శించగా వీరి కలను గుర్తించి హైదరాబాద్ లోని తెలంగాణ సారస్వత పరిషత్ కింగ్ కోటి హాల్ లో జరిగిన రాష్ట్రస్థాయి సినీ సంగీత విభావరి పోటీలలో మేడిపల్లి రాజుగౌడ్,మేడిపల్లి వెంకటేశ్వర్లు గౌడ్ ఇద్దరికీ ఉత్తమ గాయకులుగా ఇందిరా అవార్డు హీరో సుమన్ చేతుల మీదుగా అందుకోవడం జరిగింది,ఇందుకుగాను లక్ష్మారెడ్డిపల్లి గ్రామస్తులు వారిని ఘనంగా శాలువా తో సత్కరించి నగదు ప్రోత్సాహంగా రూ 5,116లు వారికి అందివ్వడం జరిగింది.
ఈ సందర్భంగా మేడిపల్లి రాజు గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతిక శాఖలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేసే కార్యక్రమంలో మాకు అవకాశం కల్పించాలని వారు ఈ సందర్భంగా వేడుకున్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఒద్ధుల విజయ అశోక్ రెడ్డి,మాజీ ఉపసర్పంచ్ మొలుగురి రాజు,గడ్డం పున్నం చందర్,వీరమల్ల వీరారెడ్డి,ఒద్దుల శ్రీకాంత్ రెడ్డి,కూచన రవీందర్,సాదు స్వప్న-చంద్రయ్య, సరోజన-సారయ్య,సుశీలగౌడ్,మామిడాల విజయ్,బాలు,వినోద్ మేడిపల్లి సతీష్ గౌడ్ ఓంకార్ గౌడ్,ఓంకార్ గౌడ్,మేడిపల్లి శ్యాంసుందర్ గౌడ్,ఓరుగంటి కుమార్ రాకేష్,మొలుగురి ఆనంద్,ఎడ్ల రాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *