ప్రజల మద్దతుతోనే బీఆర్ఎస్ అభ్యర్థి విజయం ఖాయం.

రఘునాథపల్లి ఇన్చార్జి గూడ కిరణ్ కుమార్.

రఘునాథపల్లి ( జనగామ) నేటి ధాత్రి :-
ఈనెల 13న జరిగే పార్లమెంటు ఎన్నికల్లో వరంగల్ ఎంపీ అభ్యర్థి సుధీర్ కుమార్ విజయం ఖాయమని రఘునాథ్ పల్లి బీఆర్ఎస్ ఇన్చార్జి గూడ కిరణ్ కుమార్ అన్నారు.. బుధవారం రఘునాథ్ పల్లి మండల కేంద్రంలో ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో ప్రజలు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల విశ్వాసంతో ఉన్నారని తమ ప్రచారానికి ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారని తెలిపారు. ప్రజల స్పందన చూస్తుంటే కచ్చితంగా పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం ఖాయమని తెలుస్తుందని అన్నారు. రేపు రఘునాథ్ పల్లి మండలం మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య ప్రచారం ఉన్నట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలోబీ ఆర్ ఎస్ మండల నాయకులు నాయఇమ్మడిశెట్టి రఘు,దేవర యాకయ్య,మల్కాపురం అన్వేష్ గౌడ్,కడారి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *