ప్రమాదాలకు స్వాగతం పలుకుతున్న మూలమలుపులు.

Accidents Accidents

ప్రమాదాలకు స్వాగతం పలుకుతున్న మూలమలుపులు

హెచ్చరిక బోర్డులు స్టిక్కర్లు ఏర్పాటు చేయాలి

రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లకు కొమ్ములను తొలగించాలి

పరకాల నేటిధాత్ర:

మండలంలో పలుచోట్ల మూల మలుపులతో రోడ్లపై ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.హన్మకొండ జిల్లా పరకాల నుండి మొగుళ్లపల్లికి వెళ్లే రహదారి డిపో సమీపం నుండి మొదలుకొని నాగారం గ్రామ ప్రారంభం నుండి లక్ష్మీపురం వరకు మూలమలుపుల వద్ద కనీసం ప్రమాద సూచిక బోర్డులు లేక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.మూలమలుపుల వద్ద ఎదురుగా వస్తున్న వాహనాలు దగ్గరకు వచ్చే వరకు కనిపించకపోవడంతో సూచిక బోర్డులు లేకపోవడంతోనే పలు ప్రమాదాలు చోటు చేసుకున్నాయని వాహనదారులు ఆరోపిస్తున్నారు.రాత్రి సమయంలో ప్రయాణం ఇబ్బందికరంగా మారుతున్నాదని ఎదురుగ వచ్చే వాహనాలు కనిపించక ఇప్పటికే చాలామంది ప్రమాదాలకు గురికావడం,ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటనలు ఉన్నాయని,కొన్ని స్థలాలలో ప్రమాద సూచిక బోర్డులు ఉన్నప్పటికీ చెట్లకొమ్మలు పెరగడంతో బోర్డులు కనిపించడం లేదని,రోడ్లకు ఇరువైపులా పెరిగిన చెట్లకొమ్మలను తొలగించాలని వాహనదారులు ప్రజలు కోరుతున్నారు.సంబంధిత అధికారులు స్పందించి సూచిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రమాదాలను నివారించి ప్రమాదాల శాతం తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని రహదారుల మలుపుల వద్ద హెచ్చరిక బోర్డులు రేడియం స్టిక్కర్స్ ఏర్పాటు చేయాలని ప్రజలు,వాహనదారులు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!