గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :
ఆదివాసి సంక్షేమ పరిషత్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి సనప విష్ణు పత్రిక విలేకరులతో మాట్లాడుతూ
జైనూరులో ఆదివాసి మహిళపై అత్యాచారం హత్యాయత్నానికి పాల్పడిన మూర్ఖుడు దుండగుని వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ద్వారా విచారించి 20,30 రోజుల్లో ఉరితియాలని ఆదివాసి సంక్షేమ పరిషత్ నాయకులు డిమాండ్ చేశారు.
జైనురు ఘటనలో ఆదివాసీలపై ఎదురుదాడి చేసిన మైనార్టీ ముస్లింలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ మరియు హత్యాయత్నం కేసులు పెట్టాలన్నారు.
ఆదివాసి మహిళను పూర్తిస్థాయిలో ప్రభుత్వ ఖర్చులతో కార్పొరేట్ వైద్యాన్ని అందించి ఆ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని వారు అన్నారు.