మాదిగలకు 12 శాతం రిజర్వేషన్ సాధనే లక్ష్యం

ఎంహెచ్ పిఎస్ వ్యవస్థాపక అద్యక్షులు మైస ఉపేందర్ మాదిగ

పరకాల నేటిధాత్రి
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 7 నుండి జరుగే మాదిగల జన సభలను జయప్రదం చేయాలని మాదిగ హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అద్యక్షులు మైస ఉపేందర్ మాదిగ కోరారు.ఉమ్మడి వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా మాదిగల జన సభలను విజయవంతం చేయాలని బుధవారం వరంగల్‌ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో మైస ఉపేందర్ మాదిగ పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు 12 శాతం రిజర్వేషన్ సాధనే ఏకైక లక్ష్యంగా మాదిగలు ఎంహెచ్ పిఎస్ సంఘం పనిచేయాలని రాష్ట్ర వ్యాప్తంగా మాదిగల జనజాతర సభలు జూన్ నెల నుంచి అన్ని జిల్లా కేంద్రాలలో నిర్వహించాలని పిలుపునిచ్చారు.మాదిగల జన జాతర సభను ఉమ్మడి వరంగల్‌ జిల్లా కేంద్రంలో నిర్వహించే తేదిని త్వరలో ప్రకటిస్తామని ఉమ్మడి వరంగల్‌ జిల్లా నాయకులు కార్యకర్తలు కార్యక్రమం విజయవంతం చేయడానికి సిద్దపడాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!