కబ్జాకు గురవుతున్న ఈత వనమును పరిరక్షించాలి.

Secretary Secretary

కబ్జాకు గురవుతున్న ఈత వనమును పరిరక్షించాలి: తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ
నల్లగొండ జిల్లా, నేటి దాత్రి:

 

కబ్జాకు గురవుతున్న ఈత వనమును పరిరక్షించాలని, ఈత వనం చుట్టూ ప్రహరీ గోడ నిర్మించాలనితెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ అన్నారు. చండూరు మండల పరిధిలోని నేర్మట గ్రామంలో ఉన్న ఈత వనమును కబ్జాకు గురి కాకుండా పరిరక్షించాలని కోరుతూ కల్లుగీత కార్మికులు ఈత వనం వద్ద నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామపంచాయతీ పర్మిషన్ లేకుండా ఈత వనంలో ఉన్న కంపచెట్లను తొలగిస్తున్నారని, ఎవరైనా పర్మిషన్ తీసుకొని కంప చెట్లను తొలగించడంతోపాటు ఈత వనంలో ఉన్న కంపమొద్దులను తొలగించే విధంగా చొరవ తీసుకొని ఈత వనం ను పరిశుభ్రంగా ఉంచాలని
ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈత వనంలో ఉన్న కంప చెట్లు విపరీతంగా పేరిగాయని, వాటిని తొలగించాలని ఆయన అన్నారు. ఈత వనం ఉన్న భూమిలో కొందరు మా భూమి అని కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని వెంటనే ప్రభుత్వం స్పందించి ఈత వనం ఉన్న భూమిని కాపాడాలని గీత కార్మికులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారని ఆయన అన్నారు.సామాన్య కల్లుగీత కార్మిక కుటుంబంలో పుట్టిన సర్దార్ సర్వాయ పాపన్న నేడు సమాజంలో అసమానతలకు వ్యతిరేకంగా పోరాటం చేశాడని, భారత రాజ్యాంగంలో చెప్పినట్లుగా ఆర్థిక, సామాజిక, రాజకీయ సమానత్వం కై ఉద్యమించాలని ఆయన అన్నారు. 560 జీవో ప్రకారం ప్రతి సొసైటీకి ఐదు ఎకరాల భూమి ఇవ్వాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో కల్లు గీతకార్మిక సంఘం గ్రామ శాఖఅధ్యక్షులు బుర్కల అంజయ్య గౌడ్, కల్లు గీత కార్మిక సంఘం నాయకులు బండమీది వెంకటయ్య, బోడిగే నగేష్ గౌడ్, యాదయ్య గౌడ్, శంకర్ గౌడ్, బురకల శేఖర్, రాజ్ కుమార్, సైదులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!