జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య
ముత్తారం :- నేటి ధాత్రి
ముత్తారం లో జరుగుతున్న ఇంటింటి సర్వేను జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య ఆకస్మికంగా పరిశీలించారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఎన్యుమరేటర్లు తప్పులు లేకుండా ఫారాలు నింపాలని రెండు రోజులలో సర్వేని పూర్తి చేసి ఫారాలను మండల పరిషత్ కార్యాలయంలో అందజేయాలని ఆదేశించినారు. సూపర్ వైజర్స్ అందరు కూడా సర్వే ఫారంలను తనిఖీ చేసి తప్పులు లేకుండా చూసుకోవాలని అదేవిధంగా సర్వే పూర్తి అయిన గ్రామపంచాయతీలు ఎవరైనా అందుబాటులో లేని కుటుంబాలు వారు గ్రామపంచాయతీ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శి ని సంప్రదించాలని కోరుతూ గ్రామంలో డప్పు చాటింపు చేయవలసిందిగా సూచించారు అనంతరం గ్రామపంచాయతీ ముత్తారం వాడా వాడలో లలో పరిశీలించి శానిటేషన్ పనులను సక్రమంగా నిర్వహించాలని అదేవిధంగా ప్రతిరోజు ఇంటింటి నుండి చెత్త సేకరణ చేస్తూ కంపోస్ట్ షెడ్డు కు తరలించాలని పంచాయతీ కార్యదర్శి తెలపడం జరిగింది,ఇంటి పన్నులు నవంబర్ 30 లోపు 100% వసూలు చేసి గ్రామపంచాయతీ పద్దుకు జమ చేయాలని,ట్రేడ్ లైసెన్సు అన్ని రెన్యువల్ చేయాలని ఆదేశించారు ఈ కార్యక్రమం లో డి ఎల్ పి ఓ K.సతీష్ కుమార్ మండల పంచాయతీ అధికారి కిరణ్ పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు.