జైపూర్, నేటి ధాత్రి:
తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం జైపూర్ మండలంలోని పట్టణ బూత్ 95 నంబర్ నందు (మార్పులు,చేర్పులు) ఓటర్ జాబితా తయారు చేయుటకై ఇంటింటా బూతు స్థాయి అధికారులు నిర్వహిస్తున్న సర్వే ని శుక్రవారం రాష్ట్ర ముఖ్య ఎన్నికల కమిషన్ అధికారులు తనిఖీ చేయడం జరిగింది. ఓటర్ లిస్టులో మరణించిన వారి పేర్లను తొలగిస్తూ ఓటర్ల ఫోటోలు స్పష్టంగా లేనివారికి కొత్తగా ఫోటోలు ఆన్లైన్లో అప్లోడ్ చేసుకోవాలని 18 సంవత్సరాలు పైబడిన యువతీ యువకులు ఓటర్ కార్డు నమోదు కొరకు దరఖాస్తు చేసుకోవాలని వాటిని పరిశీలించి అధికారులు ఓటర్ జాబితాను సిద్ధం చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ వనజా రెడ్డి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ తిరుపతి,బిఎల్ఓ సూపర్వైజర్స్ స్వామి, తిరుపతి,రవి చందర్ బిఎల్ఓ, శారద హాజరయ్యారు.