టౌన్ పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పీ.
జహీరాబాద్. నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లాలో శాసనసభనియోజకవర్గ కేంద్రమైన జహీరాబాద్ పట్టణంలో గల టౌన్ పోలీస్ స్టేషన్ ను మంగళవారం సాయంత్రం జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఆకస్మికంగా సందర్శించి,తనిఖీ చేశారు.

ఈకార్యక్రమంలో డిఎస్పీ రాంమోహన్ రెడ్డి, పట్టణ సీఐ శివలింగం, టౌన్ ఎస్ఐ కాశీనాథ్ యాదవ్ ఎస్పీ పరితోష్ పంకజ్ కు రికార్డులను వివరించారు.ఒకే రోజు మూడు పోలీసు స్టేషన్ లను సందర్శించి ఎస్పీ మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు జహిరాబాద్ సబ్ డివిజన్ పరిధిలోని జహిరాబాద్ టౌన్, జహిరాబాద్ రూరల్,కోహీర్ పోలీస్ స్టేషన్ లను సూడిగాలి పర్యాటనతో సందర్శించి, రికార్డు లనుతనిఖీ చేశారు.