రజతోత్సవ సభను జయప్రదం చేయాలి.

రజతోత్సవ సభను జయప్రదం చేయాలి.

#మండల పార్టీ అధ్యక్షుడు డాక్టర్ బానోత్ సారంగపాణి.

నల్లబెల్లి, నేటి ధాత్రి

silver
silver

ఈనెల 27న వరంగల్ జిల్లాలో జరిగే బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని మండల పార్టీ అధ్యక్షుడు బానోతు సారంగపాణి పిలుపునిచ్చారు. శనివారం మండలంలోని శనిగరం, ఆర్వయ పల్లె, కన్నారావుపేట గ్రామాలలో పార్టీ రజతోత్సవ సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పార్టీని స్థాపించి 25 ఏళ్లు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా రజతోత్సవ సభను వరంగల్ జిల్లాలోని ఎలుకతుర్తి లో ఏర్పాటు చేయడం జరిగిందని. తెలంగాణ సాధించిన తర్వాత 10 ఏళ్లలో రాష్ట్ర అభివృద్ధికి పాటుపడిన పార్టీ బిఆర్ఎస్ అని కొనియాడారు. కావున నర్సంపేట నియోజకవర్గం నుండి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో సభను విజయవంతం చేయడం కోసం మండలంలోని పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని రజతోత్సవ సభను జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఫ్యాక్స్ చైర్మన్ చెట్టుపల్లి మురళీధర్ రావు, మాజీ ఎంపీపీ కక్కెర్ల శ్రీనివాస్ గౌడ్, మాజీ జెడ్పిటిసి బానోతు హరినాథ్ సింగ్, క్లస్టర్ బాధ్యులు గందె శ్రీనివాస్ గుప్తా, ఇంగ్లీ శివాజీ, పిఎసిఎస్ వైస్ చైర్మన్ తక్కలపల్లి మోహన్ రావు, మాజీ సర్పంచ్ నాన్న బోయిన రాజారాం యాదవ్, నాయకులు మంద రాజిరెడ్డి, తిప్పని రవీందర్ గౌడ్, ఊట్కూరి అశోక్ గౌడ్, భూక్య బాలరాజు, మాడిశెట్టి రవి, తంగెళ్ల రవీందర్ రెడ్డి, పూజారి రాజు గౌడ్, మాజీ వార్డ్ మెంబర్లు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!