భద్రాచలం నేటి ధాత్రి
చర్ల మంగళవారం నాడు బస్టాండ్ కేంద్రంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పూణెంవరప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో గోండ్వానా సంక్షేమ పరిషత్తు రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలలో ఏ ప్రభుత్వ పథకాలైన అర్హులైన లబ్ధిదారుల ఎంపిక జరగాలంటే షెడ్యూలు ప్రాంత చట్టాలపై అధికారులు విశ్లేషణ చేసి ముఖ్యంగా ఆదివాసీలకున్న అక్కు రైట్ పై పార్లమెంటు పేషా చట్టం ద్వారా ఇందిరమ్మ గ్రామసభలు జరగాలని ప్రభుత్వాన్ని కోరారు
ఏజెన్సీ లోకి చట్ట విరుద్ధంగా వలసలు వచ్చిన గిరిజ నేతరులకు ఏ చట్టం ప్రాతిపదికన పథకాలు మంజూరు చేస్తారని అన్నారు 1970 కి ముందు ఏజెన్సీలో నివాసం ఉన్న గిరిజనేతర్లకు మేము వ్యతిరేకం కాదని గడిచిన రెండు దశాబ్దాల కాలంలో ఏజెన్సీలోకి గిరిజ నేతర వలసలు విపరీతంగా పెరిగిపోయాయని ఏజెన్సీ రూపురేఖలను చిన్నబిన్నం చేస్తున్నారని వివిధ పార్టీల లో చోటామోటా నాయకులు సేరి ఆదివాసీల హక్కులకు వి ఘాతం కలిగిస్తున్నారని ఆరోపించారు
గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం ఆయామ్ లో నిర్మించిన డబు ల్ బెడ్ రూములు భద్రాచలంలో అర్హులైన ఆదివాసీలను ఎంపిక చేసినప్పటికీ కెసిఆర్ కాలనీలో గజనేతర వ్యాపార వర్గాల వారు ఇల్లులున్న వలస గిరిజనేతరులు దర్జాగా డబుల్ బెడ్ రూములలో నివాసం ఉంటున్నారని ఆరోపించారు ఈ కార్యక్రమంలో కొరసనవిన్ దుబ్బ రాజు కణితి శ్రీను వట్టం మహేష్ తదితరులు.