#దళిత బంధు అమలులో జాప్యం చేస్తే ఆందోళనలు తప్పవు
#హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
నేటి ధాత్రి:తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల అభ్యున్నతి కోసం దళిత బందు పథకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా హుజురాబాద్ ని ఎన్నుకొని హుజురాబాద్ లోని దళిత కుటుంబాలన్నిటికీ దళిత బంధు అమలు చేశారని, అందులో భాగంగా కొంతమందికి రెండో విడత రావాల్సి ఉన్నప్పటికీ ప్రభుత్వం మారడంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దళిత బంధు అకౌంట్లను ఫ్రీజ్ చేయించి వారి జీవితాలను ఆగం చేసిందని హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం హైదరాబాదులోని తన నివాసంలో ఆయన నియోజకవర్గ దళిత బంధు తో ఆత్మహత్యయత్నానికి పాల్పడిన బాధితులకు సానుభూతి తెలిపారు. ఇదే క్రమంలో రెండో విడత దళిత బంధు రాకపోవడంతో హుజురాబాద్ నియోజకవర్గం లోని వీణవంక,జమ్మికుంటకు చెందిన దళిత సోదరుడు సోదరీమణి గాజుల అమల, శ్రీనివాస్ లు మనస్థాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని అన్నారు. బ్యాంకులు ఫ్రీజ్ చేసిన దళిత బంధు అకౌంట్ లను ఫ్రీజ్ ఎత్తివేసి హుజురాబాద్ నియోజకవర్గం లోని దళితులందరికీ వెంటనే రెండో విడత విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దళిత బంధు అమలులో జాప్యం చేస్తే హుజురాబాద్ లోని దళితులందరితోపాటు రాష్ట్రంలోని దళిత కుటుంబాలతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు.