బ్లాక్ మార్కెట్ లో విత్తనాల విక్రయాలను నియంత్రించాలి…

Seeds Seeds

బ్లాక్ మార్కెట్ లో విత్తనాల విక్రయాలను నియంత్రించాలి…

కల్తీ విత్తనాలను అరికట్టాలి…

నాణ్యమైన విత్తనాలు పురుగు మందులను సరఫరా చేయాలి…

అన్ని రకాల విత్తనాలను అందుబాటులో ఉంచాలి…

కల్తీ విత్తనాల బెడద రైతుల జీవనోపాధి పై తీవ్ర ప్రభావం చూపుతుంది…

రైతుల వ్యవసాయ సాగుకు బ్యాంకు రుణాలు మంజూరు చేయాలి…

నేటి ధాత్రి -మహబూబాబాద్ 

 

కల్తీ విత్తనాలను అరికట్టాలని, బ్లాక్ మార్కెట్లో విత్తనాల విక్రయాలను నియంత్రించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జడ సత్యనారాయణ, గుగులోత్ సక్రు, నందగిరి వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నకిలీ విత్తనాలు,ఎరువులను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో గురువారం మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బ్లాక్ మార్కెట్ లో విత్తనాలను కొనుగోలు చేసిన రైతన్న ఆరుగాలం కష్టించి పంట సాగు చేస్తున్నప్పటికీ సరైన దిగుబడి రాక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. కల్తీ విత్తనాల బెడద వ్యవసాయ ఉత్పత్తిని దెబ్బతీయటమే కాకుండా,అంతకుమించి రైతుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని అన్నారు. పంటల సాగులో మేలైన విత్తనాల ఎంపిక ఎంతో కీలకమని సరైన అవగాహన లేకపోవడంతో రైతన్నలు నకిలీ విత్తనాలను కొనుగోలు చేసి సరైన దిగుబడులు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

Seeds
Seeds

నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుమందులను అరికట్టేందుకు కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం రైతు సమస్యలపై కలెక్టర్ కార్యాలయంలో సూపరింటెండెంట్ కు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో బాబన్న, గౌని భద్రయ్య,వీరభద్రం, మాన్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!