పోలీస్ అమరుల త్యాగాలు వేలకట్టలేనివి

# నర్సంపేట టౌన్ సీఐ రమణమూర్తి.

నర్సంపేట,నేటిధాత్రి :

ప్రజా రక్షణలో బాగంగా విధులు నిర్వహిస్తూ తమ ప్రాణాలను త్యాగం చేసిన పోలీస్ అమర వీరుల త్యాగాలు వెలకట్టలేనివని నర్సంపేట టౌన్ సీఐ రమణమూర్తి తెలిపారు.
పోలీస్ అమర వీరుల సంస్మరణవారోత్సవాల ఫ్లాగ్ డే సందర్భంగా జాగృతి పోలీస్ కళా బృందం వరంగల్ నగర పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా ఆధ్వర్యంలో కళాజాత కార్యక్రమాన్ని నిర్వహించారు. నర్సంపేట బస్టాండ్ ఆవరణంలో అమర పోలీసులను స్మరించుకుంటు పాటల పాడారు. నినాదాలు చేస్తూ ప్రజలకు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నర్సంపేట టౌన్ సీఐ రమణమూర్తి హాజరైనారు.ఈ కార్యక్రమంలో ఎస్సై అరుణ్,ఏఎస్సై ,హెడ్ కానిస్టేబుల్ ఆఫీసర్స్, కానిస్టేబుల్ ఆఫీసర్స్, ప్రయాణికులు 250 మంది పాల్గోన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *