మురికి కాలువ నిర్మించిన తర్వాత రోడ్డు వేయాలి..

Municipal officials. Municipal officials.

మురికి కాలువ నిర్మించిన తర్వాత రోడ్డు వేయాలి..

సంతకాలు సేకరించి మున్సిపల్ అధికారులకు వినతిపత్రం అందజేత..

రామాయంపేట మార్చి 22 నేటి ధాత్రి (మెదక్)

 

రామాయంపేట పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి నుండి బైపాస్ రోడ్డులో డబుల్ బెడ్ రూమ్ వద్దకు వెళ్లడానికి బీటి రోడ్డు మంజూరు అయింది. ఈ పనులు రెండు మూడు రోజుల్లో ప్రారంభిస్తారని తెలుసుకున్న కాలనీ ప్రజలు సంతకాలు సేకరించి మున్సిపల్ అధికారులకు అందజేశారు. ఈ ప్రాంతం చెరువు దగ్గర ఉండటం వల్ల చెరువుల నుండి , వర్షాలు పడితే వర్షపు నీరు ఇండ్లలోకి వచ్చే పరిస్థితి ఉందన్నారు. ముందుగా సైడ్ డ్రెయిన్స్ నిర్మించిన తర్వాత రోడ్డు వేస్తే శాశ్వత పరిష్కారం ఉంటుందని కాలనీ ప్రజలు అన్నారు. ఒకవేళ ఇలా నిర్మించకుంటే మురికి నీరు వర్షపు నీరు ఇండ్లలోకి వచ్చే దుస్థితి ఉందన్నారు. తాము అభివృద్ధికి ఏమాత్రం వ్యతిరేకం కాదని కానీ సైడ్ డ్రయిన్స్ నిర్మించిన తర్వాత రోడ్డు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై సదర్ కాంట్రాక్టర్ ను అడిగితే తమకు కేవలం రోడ్డు నిర్మాణానికి మాత్రమే తనకు నిధులు వచ్చాయని సైట్ డ్రీమ్స్ కు ఎలాంటి నిధులు రాలేదని కాంట్రాక్టర్ తెలిపారని వార్డు ప్రజలు అన్నారు. సైడ్ డ్రాయింగ్స్ వేయకుండా రోడ్డు వేయడానికి ప్రయత్నిస్తే అడ్డుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎండి అస్నుద్దీన్. ఎండి సల్మాన్. ఎస్.కె షకిల్. సయ్యద్ జియా. సయ్యద్ నాజర్ బాయ్. పల్లె పెంటయ్య. ఎరుకల పోచయ్య. పల్లె యాదగిరి. ఎరుకల మోహన్. శ్రీశైలం. పల్లె కృష్ణ. తదితరులు పాల్గొన్నారు.

Municipal officials.
Municipal officials.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!