పలు గ్రామాల్లో కావాతు నిర్వహించిన పరకాల పోలీసులు
పరకాల నేటిధాత్రి హనుమకొండ జిల్లా పరకాల మండలంలోని వెల్లంపల్లి పెద్దరాజుపేట సాయంత్రం రాబోవు వారం రోజులు జరిగే గ్రామాలలో అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఎన్నికలు ప్రశాంతంగా సజావుగా జరగడానికి కేంద్ర బలగాలతో పరకాల సిఐ ఆధ్వర్యంలో కవాతు నిర్వహించడం జరిగింది. రానున్న అసెంబ్లీ ఎన్నికలలో ప్రజలు ఎటువంటి భయభ్రాంతులకు గురి కాకుండా తమ ఓటు హక్కును సక్రమంగా ఉపయోగించుకోవడానికి వారికి భరోసా కల్పించడం కోసం కవాతు నిర్వహించడం జరిగిందని సి.ఐ వెంకటరత్నం తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్.ఐ లు సిబ్బంది పాల్గొన్నారు.