
మేము చెప్పిందే శాసనం…!
మీరు ఫీజులు ఇవ్వవలసిందే…!!
‘కార్పోరేట్’ దోపిడీని అడ్డుకునేదెవరూ.. ?
ఎల్.కేజీ నుంచి టెన్త్ క్లాస్ వరకు అధిక ఫీజులు…
ఎల్ కేజీకి రూ.50 వేల నుంచి లక్షల్లో వసూలు…
పాఠశాల
అందినకాడికి దోచుకుంటున్న వైనం…
విద్య హక్కు చట్టం 2009 అమలు జాడేది.?
స్కూల్ ఎడ్యూకేషన్, బోర్డుల అధికారుల నిర్లక్ష్యం
సర్కారు మారిన, విద్యావ్యవస్థలో కనిపించని మార్పు
మాముళ్ల మత్తులో జోగుతున్నారనేది
బహిరంగంగా చర్చించుకుంటున్నారు….
నిద్రమత్తులో ప్రిన్సిపల్ సెక్రటరీలు, కమిషనర్, ఇతర ఉన్నతాధికారులు…
స్కూళ్లలోనే బుక్స్ డ్రెస్సులు స్కూల్ కు సంబంధించిన మెటీరియల్ మొత్తం స్కూల్లోనే అమ్మకాలు….
పినపాక మండలంలోని ప్రవేట్ స్కూల్ లలో సంబంధించిన మెటీరియల్ మొత్తం అమ్మకాలు పట్టించుకోని అధికారులు…
గ్రామాలలో ఏజెంట్లను పెట్టి పిల్లలని టార్గెట్ చేసి మా స్కూల్ కె రావాలని అని తల్లిదండ్రులని ఇబ్బంది పెడుతున్న ఏజెంట్లు…
‘నీకింత – నాకింత’ అన్నట్టుగా ప్రభుత్వ అధికారులు
బహిరంగంగా చర్చించుకుంటున్నారు….
ప్రవేట్ స్కూల్ లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గం ప్రేమ్ కుమార్ డిమాండ్ చేశారు
కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. నేటిధాత్రి…
తెలంగాణ రాష్ట్రంలో చదువుకునే రోజులు పోయి చదువును కొనే రోజులు వచ్చినయి. పేదోడి పిల్లవాడిని బడికి పంపుదామంటే సర్కారు బడుల్లో మాస్టర్లు లేక, ఉన్నా సమయానికి రాక,
తాగేటందుకు మంచినీళ్లు ఉండక, ఆడపిల్లలు కాలకృత్యాలకు వెళ్లామంటే బాత్రూంలు అసలే లేక గుక్కపట్టి ఓర్చుకోవాల్సిన దుస్థితి. అరె ఇంకేంది ఇన్ని సౌవలత్ లు ఉన్నంక.. ఎవరన్నా వచ్చి గవర్నమెంట్ పాఠశాలకు పొరగాండ్లను తోలుతారని అడిగేటోన్ని దేనితో కొట్టాల్నో మీరె చెప్పాలె. ‘జమ్మి ఆకుతో విస్తరి కుట్టినట్లు’ ఉంటది రాష్ట్రంలో సర్కారు చదువు పరిస్థితి, పోనీ ఈ సంగతి ఇట్లుంటే.. కూలొ నాలొ చేసుకొని బతికే భార్యభర్తలు పిల్లలను ప్రయివేటు స్కూల్లో చేర్పింద్దామంటే బడి గేటు కూడా దాటే పరిస్థితి కానరాట్లేదు. కార్పోరేట్ వ్యవస్థల మాయజాలంతో విద్యావ్యవస్థనే భ్రష్టుపట్టిపోయింది. ఒకవేళ దైర్నం జేసి బర్లో చేర్పిద్దామని వెళ్తే చాలు.. ముందుగాల్నె అడ్మిషన్ పేరుతో వేలల్లో వసూలు చేస్తరు. ఇగ అంతేకాదు ముందుంది ముసల్ల పండగ, ఎల్. కేజీ నుంచి టెన్త్ క్లాస్ దాకా ఫీజుల జోలి తీసేతట్టు లేదు. కేజీ సెక్షన్ కే రూ.50వేల నుంచి 1లక్షకు పైనే కానీ తక్కువ లేదంటే అతిశయోక్తి కాదు. ఇంత జరుగుతుంటే ప్రభుత్వం ఏం జేస్తుంది అని మాత్రం అడగొద్దు. విద్యాహక్కు చట్టం 2009 అమలు కావట్లేదా.. ప్రైవేటు స్కూల్స్లో ఫీజు నియంత్రణ లేదా అని క్వశ్చన్ లు వేస్తే.. అబ్బే లేదు.. మేం ఫీజు స్ట్రక్చర్ ఇంకా తయారు చేయలే.. నిమ్మలంగా చేత్తం.. వచ్చే విద్యా సంవత్సరం దాకా ఆగరాదు. తొందరెందుకు అనే సమాధానం వస్తదీ ఎడ్యూకేషన్ బోర్డు నుంచి, ‘ఎలుక తోక తెచ్చి ఎన్నినాళ్ళు ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు కాదు’ అన్నట్టు ఎన్ని ప్రభుత్వాలు మారిన విద్యా వ్యవస్థ తీరు మారదు అనేది సుస్పష్టం.
రాష్ట్రంలో విద్యను ప్రైవేటు పరం జేసింది. ప్రభుత్వం. స్కూల్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అలసత్వం మూలంగా ఫీజు నియంత్రణ లేకుండా పోయింది. ‘నీకింత నాకింత’ అన్నట్టుగా
ప్రభుత్వ అధికారులు మాముళ్ల మత్తులో జోగుతున్నారనేది బహిరంగంగా చర్చించుకుంటున్నారు. ఎల్కేజీ నుంచి టెన్త్ క్లాస్ వరకు లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ పేద ప్రజల్ని జలగల్లా పట్టిపీడిస్తున్నారు. కార్పోరేట్ సిస్టంలో సామాన్య, మధ్యతరగతి పిల్లలను ప్రైవేటు స్కూల్లో చేర్పించడం కలగానే మిగిలేటట్టు ఉంది. ఎల్ కేజీ సెక్షన్కి ఇంత ఫీజు, 1 నుంచి 5వ తరగతి వరకు, 6 నుంచి టెన్త్ క్లాస్ దాకా, ఈ విధంగా వసూలు చేయాలని ప్రభుత్వం నిబంధనలు (ఫీజు స్ట్రక్చర్) పెట్టాల్సి ఉంటుంది. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం 25% కోటా కింద ప్రైవేట్ పాఠశాలలు పేద పిల్లలకు అడ్మిషన్లు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ అలాంటి పరిస్థితి ఎక్కడా లేదు. ప్రైవేటు స్కూల్స్ లో కనీస సౌకర్యాలు లేవు.. ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం విశాలమైన తరగతి గదులతో కూడిన సొంత భవనం కలిగి ఉండి, ఆట స్థలం ఉన్న పాఠశాలలకు మాత్రమే ఎడ్యుకేషన్ బోర్డు పరిషన్ ఇవ్వాలి. కానీ విద్యాశాఖ అధికారులు మాముళ్లు తీసుకొని ఎలాంటి వసతులు లేకున్నా గానీ స్కూల్, అనుమతులు ఇచ్చేస్తున్నారు. అంతేకాకుండా వాటిపై నియంత్రణ కూడా పెట్టకపోవడం గమనార్హం.
2024-25 విద్యా సంవత్సరం నేది (జూన్ 12)తో ప్రారంభం అయ్యింది. ‘దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వడు’ అన్నట్టు కొత్త విద్యా సంవత్సరం వచ్చి స్కూల్స్,
స్కూల్ లలో అడ్మిషన్లు పూర్తి అయినప్పటికీ ఇంకా ప్రభుత్వం ఫీజు స్ట్రక్చర్ డిసైడ్ చేయక పోవడం విడ్డూరంగా ఉంది. దీంతో కార్పోరేట్ స్కూళ్లు, అందినకాడికి దోచుకుంటున్నాయి. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి. స్కూలు రాధిక ఎక్స్లెంట్ శ్రీవిద్య స్కూల్ లలో
50 వెల రూ. నుండి 80 వేల – 1 లక్ష వసూలు చేస్తుండడం గమనార్హం.
ఈ ఫీజుల మాటలు వింటుంటే పిల్లల పేరెంట్స్ గుండెల్లో గుబులు మొదలైతుంది.
‘నెత్తిన నోరుంటేనే పెత్తనం సాగుతుంది’ అన్నట్టు ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులకు మామూళ్లు చేస్తున్నరు. కాబట్టి కార్పోరేట్ స్కూల్స్, హవా నడుస్తోంది అనే ఆరోపణలు ఉన్నాయి.
తెలంగాణాలో విద్యావ్యవస్థను కార్పోరేట్ కాలేజీలు, స్కూల్స్ సత్తెనాల్ చేశాయి. ఇంత జరుగుతున్నా ఎడ్యుకేషన్ బోర్డు ఏం చేస్తుంది అనేది ప్రశ్న అసలు ఏం జరుగుతుందో తెలియని దుస్థితిలో ఎడ్యుకేషన్ వ్యవస్థ ఉండడం గమనార్హం. విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలు, కమిషనర్, ఇతర ఉన్నతాధికారులు నిద్రమత్తులో జోగుతున్నారు అనే అపవాది మూటగట్టుకుంటున్నారు. లక్షల్లో జీతాలు తీసుకుంటూ ఎడ్యుకేషన్ బోర్డులో పనిచేసే ఉన్నతాధికారులు కనీసం ప్రైవేటు విద్యా వ్యవస్థను గాడిలో పెట్టకపోవడంపై మేధావులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైన రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు చొరవ చూపి కార్పోరేట్ స్కూల్స్, వసూలు చేస్తున్న అధిక ఫీజులను కట్టడిచేసి ఫీజుల నియంత్రణ చేయాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎఫ్ నాయకులు దుర్గం సందీప్, సురేందర్, జాడి ప్రకాష్, జిమ్మిడి జగదీష్, జాడి దినేష్, రితీష్ జాడి వినయ్ తదితరులు పాల్గొన్నారు.