ప్రగతి ప్రణాళిక అభివృద్ది కాదు దోచుకోవడం
రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలం
మీడియా సెల్ ఇంచార్జి అశోక్
వనపర్తి నేటిదాత్రి .
తెలంగాణ రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే
మహిళలకు 2500 ఫించన్ ,తులం,బంగారం ,4000ఆసరా పింఛన్లు పెంపు ఎక్కడ అని అధికారులను కాంగ్రెస్ పార్టీ ,నాయకులను నిలదీయాలని జిల్లా మీడియా సెల్ ఇంచార్జి నంది మల్ల అశోక్ వనపర్తి లో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నివాసంలో ఆగ్రహం వ్యక్తంచేశారు ప్రజా పాలన.ప్రగతి ప్రణాళికతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రజల ఆగ్రహం గురి కాక తప్పదని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం మార్చి 6నుండి జూన్ 12వరకు నిర్వహించ నున్న ప్రజా పాలనప్రగతి ప్రణాళిక కార్యక్రమం ప్ర జల ముందర పరువు పోవడం తప్పదని బి. ఆర్. ఎస్ జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల. అశోక్ అన్నారు
పరిపాలన చేతకాక,ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో విఫలమై రేవంత్ రెడ్డి రోజుకో నాటకాని తెరపైకి తెస్తున్నారని నందిమల్ల.అశోక్ తీవ్రంగా మండిపడ్డారు 420హామీలు ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయడంలో విఫలం ఆయ్యారని విమర్శించారు బీ ఆర్ ఎస్ మాజీ ముఖ్యమంత్రి కె.సి.ఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రజలకు కె.సి.ఆర్ కిట్టు,కంటి వెలుగు ఉచిత కంటి అద్దాలు ,రైతు బంధు ఎకరాకు 6000 వేలు వేశారని ప్రభుత్వ పాఠశాల లో విద్యార్థులకు నాణ్యమైన మద్యహాన్న భోజనం రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో 5 రూపాయల భోజనం అమలు చేశారని అశోక్ ఆరోపించారు , రైతు బీమా,రైతు రుణ మాఫీ,24గంటల ఉచిత విద్యుత్,విద్యార్థులకు విద్యా బరోసా ఎగ్గొట్టిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది అని విమర్శించారు
ప్రజా పాలన పేరిట గ్రామాలకు పట్టణాలకు వచ్చే కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇచ్చిన హామీలు నెరవేర్చి మా దగ్గరకు రావాలని నిలదీయాలని గ్రామల ప్రజలకు పిలుపునిచ్చారు ఈ సమావేశములో యువత అధ్యక్షులు సూర్యవంశం.గిరి,మైనారిటీ అధ్యక్షులు జోహెబ్ హుస్సేన్,సీనియర్ నాయకులు వెంకట్ సాగర్ సయ్యద్.జమీల్,మంద.రాము,విజయ్,సాయికుమార్ తదితరులు ఉన్నారు
