
Agricultural Market Committee
గత బీఆర్ఎస్ పాలన గిరిజనుల అభివృద్ధికి అడ్డుపడింది
వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య
వర్ధన్నపేట,(నేటిధాత్రి):
వర్ధన్నపేట మండల కేంద్రంలో ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకులు &వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య,మండల పార్టీ అధ్యక్షుడు ఎద్దు సత్యం, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అబిడి రాజ్ రెడ్డి,జిల్లా సీనియర్ నాయకులు పోషాల వెంకన్నగౌడ్ లు విలేఖర్లతో మాట్లాడుతూ.
గత బి.ఆర్.ఎస్ పాలనలో హరిజన – గిరిజనులపై దాడులు జరిగినవి ఎస్టీ సంక్షేమ అభివృద్ధి కోసం పది సంవత్సరాల కాలములో ఒక్క పైసా కూడా ఖర్చు చేయలే,ఎస్సీ -ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి హరిజన ,గిరిజన కాలనీ, గూడలా లో అభివృద్ధి చేస్తే గత బి.ఆర్.ఎస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను దుర్వినియోగం చేసి ఎస్సీ, ఎస్టీ కాలాని, గూడ లలో ఒక్క పైసా పనికూడా చేయలేదు తండాలు గ్రామ పంచాయతీలు గా ఏర్పాటు అయితే బి.ఆర్. ఎస్ పాలనలో పంచాయతీ కార్యాలయా లు కట్టించ లే,అక్కడ ఏలిన సర్పంచ్ లకు నిధులు ఇవ్వలేదు, నిధులు ఇవ్వక పోయే సరికి ఆత్మహత్య లు చేసుకోవడం జరిగింది.ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు గిరిజనుల సంక్షేమ ము కోసం 17,169 కోట్లు కేటాయించి మూత వేయబడ్డ కార్పొరేషన్ ,తెరిపించి ,గిరిజన యునివర్సిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది,గత బి.ఆర్.ఎస్ పాలనలో సమగ్ర సర్వే చేసి బయట పెట్టకుండా దాస్తే,కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుల గణన విషయంలో జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నది. కులగణన ద్వారా భవిష్యత్ లో ఎస్టీ,ఎస్సీ,బిసి, మైనార్టీ వర్గాల ప్రజలకు ఉపయోగ కారంగా ఉంటుంది.కనీసం గిరిజన యునివర్సిటీ కట్టని చరిత్ర బి.ఆర్.ఎస్ పార్టీ ది.
బిసి లుగా కోన సాగిన గిరిజనులను ఎస్టీ జాబితాలో చేర్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ ది,1975 లో గిరిజనులకు వ్యవసాయ భూములు ఇచ్చి,ఇండ్ల ప్లాట్లు ఇచ్చి ఇండ్లు కట్టించింది, వ్యవసాయం చేసుకోవడం కోసం బ్యాంకులను జాతీయం చేసి పెట్టుబడులు కల్పించింది కాంగ్రెస్ పార్టీ,పోడు భూముల కోసం 1/70 యాక్ట్ చట్టం కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది,గిరిజనుల కోసం కాంగ్రెస్ పాటుపడింది,మరి గిరిజనుల కోసం బి.ఆర్.ఎస్ పార్టీ ఏమి అభివృద్ధి చేసిందో గమనించాలని గిరిజన సోదరులను కోరుచున్నాం.