నూతన వధూవరులను ఆశీర్వదించిన ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు దుర్గం సురేష్ గౌడ్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని మొట్లపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గూడూరి రఘుపతి రెడ్డి-అరుణ దంపతుల కుమారుడు గోవర్ధన్ రెడ్డి-కావ్య దంపతుల వివాహ వేడుకలు హన్మకొండ జిల్లాలోని పరకాల పట్టణంలో గల ఎంఎన్ రావు గార్డెన్ లో ఘనంగా జరిగాయి. ఈ వివాహ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన మొగుళ్లపల్లి మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు దుర్గం సురేష్ గౌడ్ నూతన వధూవరులకు అక్షింతలు వేసి..ఆశీర్వదించారు. మూడుముళ్ల బంధంతో..ఏడడుగుల అనుబంధంతో ఏకమైన ఈ జంట నిండు నూరేళ్లు పిల్లాపాపలతో, అష్టైశ్వర్యాలతో, సుఖశాంతులతో, పాడి పంటలతో వర్ధిల్లాలని ఆయన కాంక్షించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు తాళ్లపల్లి గోదారి, గట్టు శ్రీకాంత్ తదితరులున్నారు.